SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులోని లొంక హనుమాన్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో మంగళవారం ఓ మహిళ గాయపడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. లక్ష్మీ అనే మహిళ ఉపాధి హామీ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో కాలు విరిగినట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.