VSP: భీమిలి మండలం చేపలుప్పాడలో దళితుని భూమి కబ్జా ఆరోపణలపై ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల భిక్షం, రావాడ సీతారాం మంగళవారం పరిశీలించారు. బాధితుడు టి.అప్పలకొండ తెలిపిన వివరాల మేరకు సర్వే నం.51లో 3 ఎకరాలు అక్రమంగా ఆక్రమించారని ఆరోపించారు. ఫిర్యాదులపై చర్యలు ఆలస్యం అయ్యాయని కమిషన్ గమనించింది. సర్వే స్పష్టత లేక సమస్య కొనసాగుతోందని పేర్కొంది.