NTR: విజయవాడ నగరపాలక సంస్థలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సాధనపై కమిషనర్ ధ్యానచంద్ర కన్సల్టెంట్లతో సమావేశమయ్యారు. నగరానికి వచ్చే 15 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా (రూ.319 కోట్లు), భూగర్భ డ్రైనేజ్ (రూ.733 కోట్లు) ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్రం 25%, రాష్ట్రం 25% నిధులు అందించగా, మిగతా 50% మున్సిపల్ బాండ్లు, బ్యాంకుల ద్వారా సమీకరించనున్నారు.