BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని అంగన్వాడి కేంద్రం -7 నందు మంగళవారం కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PD నాగమణి పాల్గొన్నారు. తొలుత ఆమె కిశోర బాలికలతో కలిసి ర్యాలీ చేపట్టారు. కిశోర వికాసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలు సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమం జూన్ 7వ తేదీ వరకు జరుగుతుందని పేర్కొన్నారు.