• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కిశోర బాలికలకు లైఫ్ స్కిల్స్‌పై అవగాహన

VSP: భీమిలి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని బోడమెట్టపాలెం కమ్యూనిటీ హాల్‌లో ‘కిశోర వికాసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిశోర బాలికలకు లైఫ్ స్కిల్స్, స్వీయ అవగాహన, లక్ష్య నిర్ధారణపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఆర్. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. బాలికల సాధికారత, వ్యక్తిత్వ వికాసానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

May 5, 2026 / 08:23 PM IST

ముగిసిన జనాభా గణన శిక్షణ

VKB: జనాభా గణనపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ కార్యక్రమం ఇవాళ్టితో ముగిసింది. ఈ ముగింపు సభలో మున్సిపల్ కమిషనర్, ఛార్జ్ ఆఫీసర్ వెంకటయ్య పాల్గొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. గణన ప్రక్రియలో ఎటువంటి తప్పులు దొర్లకుండా, ఖచ్చితమైన వివరాలను సేకరించాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.

May 5, 2026 / 08:23 PM IST

‘వెలిగొండ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన మంత్రి’

ప్రకాశం: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దోర్నాలలో మంగళవారం వెలిగొండ ప్రాజెక్టుపై 3 గంటల సమీక్ష నిర్వహించారు. టన్నెల్ లైనింగ్ పనులు నెమ్మదించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు తెలిపారు. ఇంధనం, కార్మికులు, యంత్రాల సమస్యలను అధిగమించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనులలో అలసత్వం వహించవద్దన్నారు.

May 5, 2026 / 08:22 PM IST

నరసరావుపేటలో శానిటేషన్‌పై స్పెషల్ ఫోకస్

PLD: నరసరావుపేట పట్టణాన్ని పరిశుభ్రంగా, క్రమబద్ధంగా అభివృద్ధి చేయడంపై ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శానిటేషన్ డ్రైవ్‌లను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

May 5, 2026 / 08:22 PM IST

బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న ఎంపీ

MHBD: మే 10వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి బహిరంగ సభను పురస్కరించుకొని మహబూబాబాద్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. ప్రధాని సభకు మహబూబాబాద్ జిల్లా నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

May 5, 2026 / 08:22 PM IST

‘నూతన పద్ధతుల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలి’

VKB: రైతులు ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ ఉద్యానవన పంటల సాగుతో అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంప్రదాయ సాగుకు స్వస్తి పలికి లాభదాయకమైన ఉద్యాన పంటల వైపు మళ్లాలని సూచించారు.

May 5, 2026 / 08:22 PM IST

DC Vs CSK: కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్

CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న DC బ్యాటింగ్‌లో తడబడుతోంది. ఓపెనర్లు నిస్సంక (19), రాహుల్ (12) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కరుణ్ నాయర్ (13) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. అనంతరం నితీష్ రాణా (13) సైతం ఔట్ కావడంతో ఢిల్లీ 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

May 5, 2026 / 08:21 PM IST

‘కొండా సురేఖ వ్యాఖ్యలు సిగ్గుచేటు’

WGL: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని BJP జిల్లాఅధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు. బహిరంగ క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.కేంద్రం WGL జిల్లాకు మామునూరు ఎయిర్‌పోర్టు, గిరిజన యూనివర్సిటీ, రైల్వే ప్రాజెక్టులు వంటి అనేక నిధులు ఇచ్చిందని స్పష్టం చేశారు.

May 5, 2026 / 08:20 PM IST

బక్రీద్ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు

JGL: కోరుట్ల పట్టణంలో బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు శాంతి సమావేశం నిర్వహించారు. సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని హెచ్చరించారు. గోవుల రక్షణ పేరుతో వాహనాలను అడ్డుకోవద్దని తెలిపారు.

May 5, 2026 / 08:20 PM IST

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై కలెక్టర్‌కు ఫిర్యాదు

VKB: తాండూరు పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఒక సంస్థ ద్వారా కేవలం మైనార్టీ వర్గానికి మాత్రమే ఇళ్లను కేటాయించడం చట్టవిరుద్ధమని, ఇది ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని పేర్కొన్నారు. సదరు సంస్థను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు.

May 5, 2026 / 08:20 PM IST

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శన

MNCL: జన్నారం మండలంలోని పొన్కల్, రెండ్లగూడ, మొర్రిగూడ, దండేపల్లి మండల కేంద్రంలో ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ రాములు మంగళవారం సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు నిబంధనల ప్రకారం తాలు, తప్ప, తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలని తెలిపారు.

May 5, 2026 / 08:20 PM IST

బయోకాన్ వారసురాలిని ప్రకటించిన కిరణ్ మజుందార్

ప్రముఖ బయోటెక్ సంస్థ బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా తన వారసత్వాన్ని కొనసాగించే అంశంపై స్పష్టత ఇచ్చారు. తన మేనకోడలు క్లెయిర్ మజుందార్ భవిష్యత్తులో సంస్థను నిర్వహిస్తారని తెలిపారు. అయితే తాను ఇప్పటికిప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవట్లేదని కిరణ్ మజుందార్ స్పష్టం చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే దశలవారీగా బాధ్యతల మార్పు జరుగుతుందని ఆమె వెల్లడించారు.

May 5, 2026 / 08:19 PM IST

10వ తరగతి ఫలితాలపై డీఈవో సమీక్ష

 BDK: టెన్త్ ఫలితాలపై డీఈవో నాగలక్ష్మి మంగళవారం పాల్వంచలో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 12,727 మంది పరీక్షకు హాజరుకాగా 11,506 మంది ఉత్తీర్ణులై 90.58% ఫలితాలు సాధించడం, తక్కువ మార్కులు వచ్చిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలు 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఫెయిలైన విద్యార్థులను సప్లమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు.

May 5, 2026 / 08:18 PM IST

ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కలిసిన పరిగి సీఐ

VKB: పరిగి నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన కొండల్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు.

May 5, 2026 / 08:17 PM IST

మిల్లర్ల దోపిడీపై రైతు సంఘం ఆగ్రహం

NLG: ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం దిగుమతిలో మిల్లర్ల మోసాలను అరికట్టాలని కోరుతూ రైతు సంఘం నాయకులు కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. తాలు, తరుగు పేరుతో అదనపు కటింగులు చేస్తూ మిల్లర్లు రైతులను నిలువునా ముంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తున్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

May 5, 2026 / 08:13 PM IST