ADB: ఉట్నూర్ మండలంలోని MLA నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు , ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. మహిళా బిల్లుపైన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యున్నత స్థాయిలో మహిళలను కూర్చోబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు.
NTR: ఏ కొండూరు మండలం చైతన్య నగర్ తండాకు చెందిన భూక్య తిరిపి (65) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆమె భౌతిక కాయానికి జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి డేవిడ్, సీపీఐ మండల కార్యదర్శి వెంకటేశ్వరావు పాల్గొని నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతురాలికి ఏడుగురు సంతానం ఉన్నారు.
NRPT: ప్రజల సొమ్మును దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులను అవలంబిస్తూ, ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకుంటున్నారని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ఇటువంటి మోసపూరిత ప్రయత్నాలకు ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ASF: కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో ‘నా ఊరు–నా బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామ యువత స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రహదారి పక్కన పేరుకుపోయిన చెత్తను యువత శ్రమదానం చేసి శుభ్రం చేశారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో అందరూ భాగస్వామ్యం కావాలని యువత ప్రజలకు అవగాహన కల్పిస్తు ఆదర్శంగా నిలుస్తున్నారు.
BHPL: కాటారం మండలం నస్తూరుపల్లిలో సోమవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఆదివారం BHPL జిల్లా DCC కార్యాలయంలో DCC అధ్యక్షుడు కర్ణాకర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. నస్తూరుపల్లి సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేశామని పేర్కొన్నారు.
SRCL: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామ సర్పంచ్ కమ్మరి స్వప్న నాగరాజు, గొల్లపల్లి గ్రామ సర్పంచ్ మాడుగుల ఆమని శ్రీకాంత్, మరిమడ్ల గ్రామ సర్పంచ్ కోల స్వాతి-శ్రీనివాస్లు నిమ్మపల్లి గ్రామ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరాగా ఆయన ఆహ్వానించారు.
భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసింది. ముఖ్యంగా రూ.799 ప్లాన్(1.5GB/రోజుకు) ధరను రూ. 100 పెంచి రూ. 899గా నిర్ణయించింది. అలాగే, రూ. 859 ప్లాన్ను పూర్తిగా తొలగించింది. పెంచిన ఈ కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
టీమిండియాతో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా మహిళా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు లారా వోల్వార్ట్ (54), సునే లూస్ (57) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో శ్రేయాంకా 2 వికెట్లు పడగొట్టింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల T20 సిరీస్లో SA 2-0 ఆధిక్యంలో నిలిచింది.
KRNL: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ భార్య నరసమ్మపై భర్త రామయ్య కత్తితో దాడి చేశాడు. కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఈ దంపతులు, కూతురు శాంతి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చిన రామయ్య నరసమ్మపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
KMR: జిల్లాలో ఇవాళ సాయంత్రం భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా పాత రాజంపేటలో 21.8 మి.మీ ల మోస్తారు వర్షపాతం నమోదు కాగా సదాశివనగర్, దోమకొండ, పల్వంచ, రామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూర్ మండలాల్లో తేలికపాటి నుంచి సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపారు.
TPT: పుత్తూరు మున్సిపాలిటీ 5వ వార్డు పిల్లారుపట్టులో త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చొరవతో కొత్త బోరు త్రవ్వక పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి పాల్గొని, వేసవి నీటి అవసరాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేను అభినందించారు.
TG: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని మంత్రి జూపల్లి అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చందుకు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లెస్తున్నామన్నారు. వనపర్తి జిల్లా పానగల్(M)లో కస్తూర్బా గాంధీ విద్యాలయానికి రూ.40లక్షల వ్యయంతో ప్రహరీ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
SS: టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన పాళ్యం రామసుబ్బమ్మ ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిశారు. రామగిరి మండలం వెంకటాపురంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మహిళా నాయకురాళ్లతో కలిసి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నేకొత్తపల్లి మండలం నామాల గ్రామానికి చెందిన రామసుబ్బమ్మ పార్టీ మహిళా విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు.
కృష్ణా: గన్నవరం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం కండిషనల్ బెయిల్ నిబంధనల ప్రకారం హాజరై సంతకాలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిర్దిష్ట కాలవ్యవధిలో పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకాలు చేయాల్సి ఉండగా, వల్లభనేని వంశీ వాటిని పూర్తి చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
KDP: చాపాడు(M పరిధిలోని పెన్నానదిలో ఫిల్టర్లు వేసుకుని వాటి నుంచి వచ్చే నీటి ఆధారం రజకులు జీవనం సాగిస్తున్నారు. తిప్పిరెడ్డిపల్లె,రాజుపాలెం,నరహరిపురం, వెదురూరుకు చెందిన రజకులు దుస్తులను పెన్నానదిలో ఫిల్టర్ల నీటి ఆధారంగా శుభ్రం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో దోబి ఘాట్ ఏర్పాటు చేస్తే సమస్యలు ఉండవని రజకులు కోరుతున్నారు.