ASR: కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పంచాయతీకి చెందిన పల్లాల వెంకటేశ్వర్లు (32)వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేశ్వర్లు ఉల్లిగుంటలొద్దిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో వడదెబ్బకు గురై పడిపోయినట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో ప్రాణాలు కోల్పోయాడని వారు ఆవేదన చెందారు.
SDPT: చిన్నకోడూర్ పీఎస్ పరిధిలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకునేందుకు యత్నించిన నిందితుడు నెదునూరి అనిల్కు సిద్దిపేట కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జక్కాపూర్కు చెందిన దాసరి ఎల్లవ్వపై నిందితుడు దాడి చేయగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం నిందితుడికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.
GDWL: ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి అలంపూర్ మండలం సింగవరం-1 సర్పంచ్ గొంగోళ్ల ఈశ్వర్ గ్రామీణ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా నిధులు అందకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, మౌలిక వసతులు దెబ్బతిన్నాయన్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
NDL: మంగళగిరిలో నిర్వహించిన టీడీపీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అవగాహన వర్క్షాప్లో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ పాల్గొన్నారు. ఓటరు జాబితాల ప్రక్షాళన, అర్హులైన ఓటర్ల నమోదు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంపుపై చర్చించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలన్నారు.
AP: ఈ నెలాఖరున AP, కర్ణాటక CMలు తుంగభద్ర ప్రాజెక్టు గేట్లను ప్రారంభిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డ్యామ్కు రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. తుంగభద్ర గేట్లు ప్రమాదకరంగా ఉన్నా జగన్ పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కొత్త గేట్లు ఏర్పాటు చేశామన్నారు. మంత్రి నిమ్మలతో తుంగభద్ర బోర్డు ఛైర్మన్ S.N.పాండే సమావేశమయ్యారు.
SRCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాలు, వర్షాకాలం సన్నద్ధత, గ్రామసభల నిర్వహణ, నిర్వహించిన కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే పాల్గొన్నారు.
NRPT: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 4న నారాయణపేట జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వినీత్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళవారం ఆయన మక్తల్ పట్టణ శివారులో సీఎం ల్యాండింగ్ కోసం సిద్ధం చేస్తున్న హెలిప్యాడ్ను పరిశీలించారు. అనంతరం కాట్రేవ్ పల్లి వద్ద జరుగుతున్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల ప్రాంతాన్ని సందర్శించారు.
ASR: పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ మద్దివీధిలో ఆవులు, పాడి గేదెలు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కలుషిత నీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు, అంతుచిక్కని వ్యాధులు, సరైన వైద్యం అందకపోవడంతో చనిపోతున్నాయని గిరిజనులు చెబుతున్నారు. అధికారులు స్పందించి మద్దివీధిలో పశువైద్య శిబిరం ఏర్పాటుచేసి మూగ జీవాల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.
MDCL: అల్వాల్ పీఎస్ పరిధి గంగా ఎవెన్యూలో సీఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై కాలనీవాసులకు సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం, మీ సురక్ష, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
‘ఉప్పెన’ విడుదల కాకముందే ‘పెద్ది’’కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు బుచ్చిబాబు చెప్పాడు. ఈ సినిమాలోని అసలు ట్విస్ట్ రివీల్ కాకుండా ఉండేందుకు, ఏకంగా 50 నిమిషాల ముఖ్యమైన ఫుటేజీని ట్రైలర్ కోసం అస్సలు వాడలేదని తెలిపాడు. అందుకే ట్రైలర్లో కథను పూర్తిగా చెప్పలేకపోయామని, అయినా సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో సరైన దారిలోనే వెళ్తున్నామని అన్నాడు.
BHNG: భువనగిరి మండల పశువైద్యశాల పరిధిలో గల సబ్ సెంటర్ల డాక్టర్లు గొర్ల మేకల కాపర్లకు అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని, జీఎంపీఎస్( గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం) జిల్లా కార్యదర్శి దయ్యాల నర్సింహా కోరారు. సోమవారం భువనగిరి మండలంలోని ముస్త్యాల పెల్లి, చీమల కొండూరు, రాయగిరి గొర్రెల మందల ను సందర్శించి, గొర్ల కాపరులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ADB: ప్రతి ఒక్కరు చెట్లను నాటి రక్షించాలని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం నార్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామస్థులకు చెట్లు పంపిణి చేశారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న సందర్బంగా చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అందరు కృషి చేయాలని పేర్కొన్నారు.
NRML: కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన బూఖ్య చిన్న రాము బైక్పై సోమవారం కూరగాయలు అమ్మడానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో రాము తనకు తీవ్ర గాయం కాగా నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాము మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
BDK: బూర్గంపాడు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పినపాక నియోజకవర్గ ఉద్యమకారుల ఇంఛార్జ్ పొడియం నరేందర్ కుమార్ నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి తదితర అధికారులను సన్మానించారు.
కోనసీమ: ఆలమూరు మండలం మోదుకూరులోని సత్యనారాయణ ట్రేడర్స్ రైస్ మిల్స్లో రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బియ్యం నిల్వలు, రికార్డులు, నాణ్యత ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనల అమలును పరిశీలించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.