BDK: వేసవి శిబిరాల్లో నేర్చుకున్న కళలను నిరంతరం సాధన చేస్తేనే భవిష్యత్తులో రాణించవచ్చని ITDA పిఓ బి.రాహుల్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం భద్రాచలం గిరిజన బాలికల పాఠశాల, వికాసం పాఠశాలల్లో జరుగుతున్న సమ్మర్ క్యాంపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్యాన్స్, కంప్యూటర్ శిక్షణ తరగతులను పరిశీలించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు.