అన్నమయ్య: చిట్వేల్ మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు లారీ సుబ్బారాయుడు రాష్ట్ర కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులను కలిశారు. మండలంలో నెలకొన్న అభివృద్ధి, ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలపై సమగ్రంగా వివరించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాయకులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.