W.G: రాష్ట్రంలో కురిసిన ఆకాల వర్షాలకు 2500 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిని రూ.34 కోట్ల మేర ఆర్థిక నష్టం కలిగిందని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో మాట్లాడారు. ప్రధానంగా మామిడి, అరటి, బొప్పాయి, బత్తాయి తోటలు దెబ్బతిన్నట్లు వివరించారు.