E.G: జిల్లాలోని గ్రామపంచాయితీలలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించినవారికి ప్రభుత్వం 5% రాయితీ ప్రకటించబడినదని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు పన్ను చెల్లించేవారు ఈ రాయితీని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.