నిజామాబాద్ నగరంలోని ఓ శ్మశాన వాటికలో మంగళవారం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నాలుగో టౌన్ పరిధిలోని పద్మశాలి స్మశాన వాటికలో ఓ గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాలుగో టౌన్ ఎస్హెచ్వో సతీష్ మృతుడి వివరాలపై ఆరా తీశారు.