PDPL: గ్రామసభల ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఆదేశించారు. ఆయన ఇవాళ హైదరాబాదు నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 4, 6, 8, 10 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డులు, డివిజన్లలో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.