SKLM: చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పాతపట్నం నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా కొత్త పెన్షన్లు మంజూరు కాలేదన్నారు.