ADB: వృక్ష సంపదను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వాల్ పోస్టర్ను సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్ రాబిన్సన్, ఎమ్డీ. జావీద్ అన్వర్ సబీమ్, ఫీల్డ్ ఆఫీసర్ గంజివార్ సాయిప్రసాద్, తదితరులు ఉన్నారు.