VZM: మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా రైలు నంబరు 17244 రాయగడ్-గుంటూరు ఎక్స్ప్రెస్లో సీతానగరం ఎస్సై, ఆర్పీఫ్ బృందంతో పార్వతీపురం నుంచి గజపతినగరం రైల్వేస్టేషను వరకు ప్రయాణికుల సామాన్లలను క్షుణ్ణంగా తనిఖీలు చేసారు. ఫలితంగా ఎటువంటి మత్తు పదార్థాలు గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేశామని చెప్పారు.