ప్రకాశం: ఒంగోలు ఉప విద్యాధికారిగా మర్రిపూడి (M) ఎంఈవో రంగయ్యను నియమిస్తూ ఆర్జెడి లింగేశ్వర రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇవి రంగయ్య ఈ రోజు ఒంగోలులో ఉపవిద్యాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఉప విద్యాధికారిగా విధులు నిర్వహించిన చంద్రమౌలేశ్వర్ ఉద్యోగ విరమణ చేయడంతో ఈ స్థానంలో మర్రిపూడి ఎంఈవో రంగయ్యను నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు.