VZM: భీమునిపట్నం మండలం రాజుల తాళ్లవలసకు చెందిన దాట్ల సూర్య అప్పలరాజు (87) వృద్ధాప్య సమస్యతో మంగళవారం మృతి చెందారు. మరణించిన తన తండ్రి కోరికను నెరవేర్చాలని కుమార్తె రమాదేవి కార్నియాలను దానం చేశారు. అదే విధంగా ఆయన పార్థివ దేహాన్ని అఖిలభారత శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ సహకారంతో విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అప్పగించారు.