NLR: కొడవలూరు మండలం రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్లో ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమానికి సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించనున్న భూమి పూజకు ముందుగా సభా ప్రాంగణాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నేతలతో కలిసి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు.