MDK: మెదక్ మార్కెట్ ప్రాంతంలో జూదం ఆడుతున్న ఐదుగురిని టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు మెరుపు దాడి చేసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.37,335 నగదు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో వెంకట్, హుస్సేన్, శేఖర్, రంగారాం, రాజు ఉన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.