ASF: బైక్ అదుపుతప్పి తిర్యాణి మండలం గిన్నెదరికి చెందిన ఉపాధ్యాయుడు మడావి రవి (36) అక్కడికక్కడే మృతి చెందాడు. సుంగాపూర్ పాఠశాలలో CRTగా పనిచేస్తున్న రవి మంగళవారం స్వగ్రామం గిన్నెదారికి బైక్పై బయలుదేరారు. తుంపల్లి శివారులోని మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుకు తలబలంగా ఢీకొట్టడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.