SRCL: జిల్లాలో 11 సబ్ స్టేషన్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశం అనంతరం ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ మంత్రులు ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబు, నాగేశ్వరరావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, కలెక్టర్ పాల్గొన్నారు.