SDPT: ప్రజలు తెలంగాణ రక్షణ సేన(TRS) పార్టీని ఆదరించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. దుబ్బాకలోని రామాలయ దర్శనానికి వెళ్తూ మంగళవారం సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఆమె కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే సిద్దిపేటలో పర్యటించి అన్ని కమిటీలను నియమిస్తామని తెలిపారు. ఇక్కడి ప్రజలు తమకు అండగా ఉంటారనే నమ్మకం ఉందన్నారు.