KDP: ప్రొద్దుటూరులో 6 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2.20 లక్షల నగదు, ల్యాప్ టాప్, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ తెలిపారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నిందితులకు చెందిన 16 బ్యాంకు అకౌంట్లలోని రూ.4.14 లక్షలు ఫ్రీజ్ చేశామన్నారు.