MHBD: తొర్రూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో అదనపు వసతుల నిర్మాణ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు.