KKD: వేసవి తీవ్రత, భానుడి భగభగలకు పిఠాపురంలో కొబ్బరి బొండాలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. మంగళవారం మార్కెట్లో గతంలో రూ.20 నుంచి రూ.30 పలికిన బొండం ధర ప్రస్తుతం రూ.50 నుంచి రూ. 70 వరకు చేరింది. రూ.80 అమ్మే కొబ్బరి నీళ్ల బాటిల్ ధర ఏకంగా రూ.120 నుంచి రూ. 140 కి పెరిగింది. ఎండల నుంచి ఉపశమనం కోసం కొబ్బరి నీళ్లు తాగేందుకు ఆసక్తి చూపడంతో డిమాండ్ పెరిగింది.