• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జగన్‌ను కలిసిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

KRNL: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై నాయకత్వంతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

March 10, 2026 / 09:48 PM IST

రేపు స్పీకర్ చేతుల మీదుగా సబ్ స్టేషన్ ప్రారంభం

VKB: వికారాబాద్ మండలం జైలుపల్లిలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్, మెటీరియల్ గోడౌన్‌ను రేపు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించనున్నారని విద్యుత్ శాఖ ఎస్ఈ (SE) రవి ప్రసాద్ తెలిపారు. దాదాపు రూ. 6 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారన్నారు. ఈ సబ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

March 10, 2026 / 09:46 PM IST

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు

ప్రకాశం: అర్థవీడు మండలంలోని యాచవరం గ్రామ శివార్లలో మంగళవారం పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.27,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నాంచారయ్య తెలిపారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

March 10, 2026 / 09:40 PM IST

‘వరంగల్‌ను HYD తరహాలో తీర్చిదిద్దుతాం’

TG: వరంగల్ సమగ్ర అభివృద్ధిపై మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ అధికారులతో సమీక్షించారు. వరంగల్‌ను HYD తరహాలో తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2లోగా MGM సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని, నగరాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

March 10, 2026 / 09:40 PM IST

రామనారాయణంలో 108 నదీ జలాలతో పూజలు

VZM:  శ్రీ రామనారాయణంలో ద్వాదశ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో అన్ని దేవత మూర్తులకు 108 నదీ జలాలతో అష్ట కలశ స్నపన పూజలు జరిగాయి. ఈ సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నారాయణ శ్రీనివాస్, నీరజవల్లి దంపతులు, శ్రీ నారాయణం సీతారామయ్య, పద్మశ్రీ దంపతులు,చంద్రకళ, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

March 10, 2026 / 09:38 PM IST

సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులు

NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు రాత్రి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు కురుమూర్తి మాట్లాడుతూ.. ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం సంపూర్ణంగా బాగుంటుందని భావించి వారికోసం విద్యా అందించడంలో కృషి చేసిందన్నారు.

March 10, 2026 / 09:37 PM IST

వైభవంగా రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం

BDK: చర్ల మండలం లక్ష్మీ కాలనీ పంచాయతీ పరిధిలో ని జాంబవంతుడి గుట్టల పై వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని ఆలయ నిర్వహకులు గత మూడు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజైన ఇవాళ కళ్యాణాన్ని గిరిజన పూజారులు గిరిజన ఆచార సంప్రదాయాలలో ఎల్లమ్మ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు పోటెత్తారు.

March 10, 2026 / 09:36 PM IST

తీవ్ర విషాదం.. 10 రోజుల్లో 24 మంది మృతి

MHBD: కొత్తగూడ మండల వ్యాప్తంగా మార్చి 1వ నుంచి 10వ తేదీ వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది గడ్డిమందు తాగి ఆత్మహత్య, మిగతా 13 మంది సాధారణ కారణాల వల్ల చనిపోయారు. ఈ మరణాల శ్రేణి స్థానికులను భయాందోళనలోకి గురిచేస్తోంది. మరణాల గురించి ఊర్లో కూడా తెలియని ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో మండలంలో విషాద వాతావరణం నెలకొంది.

March 10, 2026 / 09:35 PM IST

ఇలాంటి వారు అరటిపండు తినకూడదా?

అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొందరు వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలర్జీ, శ్వాసకోస సమస్యలు, ఆస్తమా బాధితులు తినకూడదు. మలబద్ధకం ఉన్న వారు తింటే అది మరింత తీవ్రం కావచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. బీపీ, షుగర్ ఉన్నవారు తినకుంటేనే మంచిది. అరటిలో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి వీరికి అంతగా మేలు చేయదు.

March 10, 2026 / 09:34 PM IST

బాణాసంచా విక్రయ కేంద్రాల్లో తనిఖీలు

W.G: చిట్టవరం, నవరసాపురం గ్రామాల్లోని బాణాసంచా విక్రయ కేంద్రాలను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మూడు బాణాసంచా షాపులను స్వయంగా పరిశీలించి, నిల్వ ఉన్న బాణాసంచా వివరాలను, అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. బాణాసంచా నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కోరారు.

March 10, 2026 / 09:32 PM IST

భక్తులు నిర్దేశిత సమయానికే రావాలి: TTD

AP: స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలోనే అనుమతించనున్నట్లు TTD స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సోమవారం నుంచి నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడొద్దని, తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది.

March 10, 2026 / 09:31 PM IST

రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు

BPT: చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎస్‌ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో వెళ్లే వాహనాలను ఆపి పత్రాలు పరిశీలించారు. అనుమానాస్పద వాహనాలు, నిబంధనలు పాటించని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు. రహదారి భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

March 10, 2026 / 09:30 PM IST

రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

KDP: రైల్వే స్టేషన్‌లో వన్ టౌన్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీఐ చిన్న పెద్దయ్య, ఎస్సై అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్టేషన్ పరిసరాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల లగేజీలను తనిఖీ చేసి వారి వివరాలను తెలుసుకున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.

March 10, 2026 / 09:23 PM IST

మార్చి 15న బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం

బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 15న ఢిల్లీలో జరగనుంది. టీ20 WC విజేతలతో పాటు ఇతర ఐసీసీ టోర్నమెంట్ విజేతలు, కోచ్‌లను ఆహ్వానించనున్నట్లు BCCI సెక్రటరీ సైకియా వెల్లడించాడు. సీనియర్ పురుషుల జట్టు, 2025లో ట్రోఫీని గెలుచుకున్న సీనియర్ మహిళల జట్టు, అండర్-19 బాలుర, బాలికల జట్లు రానున్నట్లు తెలిపాడు. 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలనూ సన్మానించనున్నట్లు పేర్కొన్నాడు.

March 10, 2026 / 09:22 PM IST

డ్రైనేజ్ పనులు పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు కొత్తూరు బీసీ కాలనీలో కొత్తగా నిర్మించిన డ్రైనేజ్ పనులను టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్ పనుల నాణ్యతను పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని సంబంధిత వారికి సూచించారు.

March 10, 2026 / 09:20 PM IST