• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గుంటూరులో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి

GNTR: కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తలపకట్టి హోటల్ పక్కన అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మంగళవారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకోగా, ముగ్గురు సెల్ ఫోన్లు, 2 నిరోధ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్న లక్ష్మి, రాపోలు శివను గుర్తించారు.

March 10, 2026 / 10:00 PM IST

‘ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి’

NTR: ఇబ్రహీంపట్నంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నూతన ట్రాఫిక్ సీఐ డి. చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం రింగ్ సెంటర్‌లో వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వస్తే ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణరక్షణ కవచంగా ఉంటుందని చెప్పారు.

March 10, 2026 / 10:00 PM IST

గనుల శాఖపై చంద్రబాబు సమీక్ష

AP: గనుల శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు, రాష్ట్రాన్ని ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్‌గా మారుస్తామన్నారు. త్వరలో టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్ మిషన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యమని, 3 ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

March 10, 2026 / 09:57 PM IST

రేపటి నుంచి కలెక్టర్ల కాన్ఫరెన్స్

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ది కార్యక్రమాలపై ఆయన కీలక సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పెండింగ్ పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.

March 10, 2026 / 09:54 PM IST

ఓటీటీలోకి ‘కపుల్ ఫ్రెండ్లీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన క్రేజీ ఎంటర్‌టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ కానుంది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ కథలో సంతోష్ మార్క్ కామెడీ, మానస నటన ప్రత్యేకం. ఈ వీకెండ్ వినోదం కోసం ఓటీటీ ప్రియులు సిద్ధమైపోవచ్చు.

March 10, 2026 / 09:50 PM IST

జగన్‌ను కలిసిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

KRNL: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై నాయకత్వంతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

March 10, 2026 / 09:48 PM IST

రేపు స్పీకర్ చేతుల మీదుగా సబ్ స్టేషన్ ప్రారంభం

VKB: వికారాబాద్ మండలం జైలుపల్లిలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్, మెటీరియల్ గోడౌన్‌ను రేపు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించనున్నారని విద్యుత్ శాఖ ఎస్ఈ (SE) రవి ప్రసాద్ తెలిపారు. దాదాపు రూ. 6 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారన్నారు. ఈ సబ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

March 10, 2026 / 09:46 PM IST

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు

ప్రకాశం: అర్థవీడు మండలంలోని యాచవరం గ్రామ శివార్లలో మంగళవారం పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.27,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నాంచారయ్య తెలిపారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

March 10, 2026 / 09:40 PM IST

‘వరంగల్‌ను HYD తరహాలో తీర్చిదిద్దుతాం’

TG: వరంగల్ సమగ్ర అభివృద్ధిపై మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ అధికారులతో సమీక్షించారు. వరంగల్‌ను HYD తరహాలో తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2లోగా MGM సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని, నగరాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

March 10, 2026 / 09:40 PM IST

రామనారాయణంలో 108 నదీ జలాలతో పూజలు

VZM:  శ్రీ రామనారాయణంలో ద్వాదశ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో అన్ని దేవత మూర్తులకు 108 నదీ జలాలతో అష్ట కలశ స్నపన పూజలు జరిగాయి. ఈ సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నారాయణ శ్రీనివాస్, నీరజవల్లి దంపతులు, శ్రీ నారాయణం సీతారామయ్య, పద్మశ్రీ దంపతులు,చంద్రకళ, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

March 10, 2026 / 09:38 PM IST

సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులు

NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు రాత్రి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు కురుమూర్తి మాట్లాడుతూ.. ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం సంపూర్ణంగా బాగుంటుందని భావించి వారికోసం విద్యా అందించడంలో కృషి చేసిందన్నారు.

March 10, 2026 / 09:37 PM IST

వైభవంగా రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం

BDK: చర్ల మండలం లక్ష్మీ కాలనీ పంచాయతీ పరిధిలో ని జాంబవంతుడి గుట్టల పై వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని ఆలయ నిర్వహకులు గత మూడు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజైన ఇవాళ కళ్యాణాన్ని గిరిజన పూజారులు గిరిజన ఆచార సంప్రదాయాలలో ఎల్లమ్మ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు పోటెత్తారు.

March 10, 2026 / 09:36 PM IST

తీవ్ర విషాదం.. 10 రోజుల్లో 24 మంది మృతి

MHBD: కొత్తగూడ మండల వ్యాప్తంగా మార్చి 1వ నుంచి 10వ తేదీ వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది గడ్డిమందు తాగి ఆత్మహత్య, మిగతా 13 మంది సాధారణ కారణాల వల్ల చనిపోయారు. ఈ మరణాల శ్రేణి స్థానికులను భయాందోళనలోకి గురిచేస్తోంది. మరణాల గురించి ఊర్లో కూడా తెలియని ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో మండలంలో విషాద వాతావరణం నెలకొంది.

March 10, 2026 / 09:35 PM IST

ఇలాంటి వారు అరటిపండు తినకూడదా?

అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొందరు వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలర్జీ, శ్వాసకోస సమస్యలు, ఆస్తమా బాధితులు తినకూడదు. మలబద్ధకం ఉన్న వారు తింటే అది మరింత తీవ్రం కావచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. బీపీ, షుగర్ ఉన్నవారు తినకుంటేనే మంచిది. అరటిలో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి వీరికి అంతగా మేలు చేయదు.

March 10, 2026 / 09:34 PM IST

బాణాసంచా విక్రయ కేంద్రాల్లో తనిఖీలు

W.G: చిట్టవరం, నవరసాపురం గ్రామాల్లోని బాణాసంచా విక్రయ కేంద్రాలను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మూడు బాణాసంచా షాపులను స్వయంగా పరిశీలించి, నిల్వ ఉన్న బాణాసంచా వివరాలను, అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. బాణాసంచా నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కోరారు.

March 10, 2026 / 09:32 PM IST