WGL: గీసుగొండ మండలానికి చెందిన కౌలు రైతు చాపర్తి రమేష్ (45) అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్వంత భూమితో పాటు కౌలుకు భూమి తీసుకుని సాగు చేసినప్పటికీ పంటలు ఆశించిన మేర దిగుబడి ఇవ్వకపోవడంతో అప్పులు పెరిగాయి. తీవ్ర మనస్తాపానికి గురైన రమేష్ పురుగుల మందు తాగగా, ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.