TG: జలమండలి ఎన్నికల్లో మిగులు బడ్జెట్ తెలంగాణను అప్పుల పాలు చేసిన BRSకు కార్మికులు ఓటుతో బుద్ధి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. జలమండలి కార్మికుల సమస్యల పరిష్కారానికి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు.