SDPT: బెజ్జంకి మండలానికి చెందిన పాడి రైతులు పుర్మ లచ్చిరెడ్డి, గుబిరే రాజయ్య మరణించడంతో వారి కుటుంబాలకు కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో రూ. 50 వేల చొప్పున ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. డెయిరీ ఛైర్మన్ చెల్మెడ రాజేశ్వర్ రావు చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. పాడి రైతుల కుటుంబాలకు ఈ బీమా సొమ్ము ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు.