VZM: గజపతినగరం మండలం మరుపల్లి గ్రామ శివార్లలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిపై స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. పేకాట ఆడుతున్న 11మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి బెట్టింగులకు వినియోగిస్తున్న రూ.1,73,830/- ల నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.