ELR: చింతలపూడి క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన ఎమ్మెల్యే సత్వరమే సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.