KDP: బద్వేలులోని సిద్దవటం రోడ్డులో ఉన్న శివరామకృష్ణ నగర్ 5వ వీధిలో పట్టపగలు చోరీ జరిగింది. బి.నరసింహారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు సుమారు 16 తులాల బంగారం,రూ.1.85 లక్షల నగదు,వెండి వస్తువులను అపహరించినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.