NTR: వీరులపాడు మండలంలోని జగన్నాధపురం, జమ్మవరం గ్రామాల్లో శనివారం సాయంత్రం ఎస్సై అభిమన్యు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.