ప్రకాశం: కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నూతన గ్రంధాలయ భవన నిర్మాణానికి మంత్రి స్వామి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ. 95 లక్షల వ్యయంతో ఈ గ్రంథాలయం నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ గ్రంథాలయం అన్ని వసతులతో కొండేపికే ఒక తలమానికంగా నిలవనుందని మంత్రి అన్నారు.