AP: తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్సైట్లపై టీటీడీ అప్రమత్తమైంది. ఓ భక్తుడు మోసపోయిన ఘటనలో TTD విజిలెన్స్ విభాగం సమగ్ర విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో దీనిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు TTD ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్శనం, వసతి గదులు, సేవా టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.