CTR: పుంగనూరులో మంగళవారం జరిగే రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుందని చెప్పారు. వాహన సేవలలో భక్తులు పాల్గొనాలని కోరారు.
KNRL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో వసంత పంచమిని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు బృందావనానికి వివిధ ఫలాలతో పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బృందావనానికి పూలు బంగారు కవచాలు పట్టు వస్త్రాలతో అలంకరించారు. శ్రీ మఠం పీఠాధిపతి నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు.
VSP: వన్ టౌన్ ప్రాంతంలోని 37వ వార్డులోని జంబల్ తోట ప్రాంతంలో గల వరసిద్ధి వినాయక ఆలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఆలయ వార్షికోత్సవ నేపథ్యంలో ఎమ్మెల్యే తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు.
TPT: గూడూరు గ్రామ దేవత శ్రీ తాళమ్మ అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు అర్చనలు అలంకారాలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గూడూరు గ్రామ శివారులో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
VZM: విజయనగరం స్థానిక బాబామెట్టలో గల శ్రీ శివ పంచాయతన దేవాలయంలో ఆదివారం మాఘ మాసం మొదటి వారం పర్వదిన సందర్భంగా అర్చకులు సుప్రభాత సేవ అనంతరం శ్రీ సూర్యనారాయణమూర్తికి అభిషేకాలు, అర్చనలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కేఏపీ రాజు, శివ, నారాయణ రావు, సాంబరాజ పాల్గొన్నారు.
ATP: పెద్దపప్పురు మండలం చిన్నపప్పురులో అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం అర్థ రాత్రి నుంచే అశ్వర్థ నారాయణస్వామి, శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారిని వివిధ పూలతో అలంకరించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు.
E.G: అంతర్వేది కళ్యాణ ఉత్సవాలకు స్పెషల్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేయరాదని, అమలాపురం నుంచి మలికిపురం వరకు కాకుండా అమలాపురం నుంచి అంతర్వేది వరకు పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకులు శిరంగు నాయుడు కోరారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ చర్ల సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.
AP: ఫిబ్రవిరి 4న తిరుమలలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. భద్రత, జన రద్దీ నిర్వహణ, తదితర అంశాలపై సమీక్షించారు. విజిలెన్స్, సెక్యూరిటీ, వివిధ భాగాల అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని జన రద్దీని అంచనాలు వేసి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని పలు రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అధిక సంఖ్యలో పూజలో పాల్గొని అమ్మవారికి నెయ్యి దీపాలు వెలిగించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ATP: గుంతకల్లు మండలం కొంగనపల్లిలో ఈనెల 22న బుధవారం జాతర మహోత్సవం ఉంటుందని గ్రామ ప్రజలు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పెద్దమ్మ తల్లి, సుంకులమ్మ అమ్మవార్లకు భోనాలు సమర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు వివిధ ప్రాంతాల వారు వచ్చి జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.
SRPT: సూర్యాపేటలో బొడ్రాయి బజార్ వద్ద వేదాంత భజన మందిరంలో శనివారం గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం, సీతారామచంద్ర మాస కళ్యాణ, మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, స్వామివారికి పట్టు వస్త్రాలు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు.
MDK: జిల్లా పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవాలయంలో బుధవారం వన దుర్గమ్మకు ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. అనంతరం మంగళహారతి నీరాజనం చేశారు. జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు తెల్లవారి నుంచి ఆలయానికి తరలివస్తున్నారు. స్థానిక నది పాయలో పుణ్యస్నానం చేసి వన దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు.
W.G: పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలోని గరగాలమ్మ దిబ్బ నందు వెంచేసియున్న శ్రీ గరగాలమ్మ తల్లి జాతర మహోత్సవానికి మంగళవారం రాత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసే ఆశీర్వచనాలు ఇచ్చారు.
W.G: మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ ఆంబోతుతిప్పలోని శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం ఆలయ ఆవరణలో భక్తులచే అర్చకులు అభిషేకాలు చేయించారు. ఆలయ ప్రాంగణంలో స్వాములు భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.