శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తిక మాసం, శుక్లపక్షం పంచమి: రా. 12-46 తదుపరి షష్ఠి జ్యేష్ఠ: ఉ. 8-20 తదుపరి మూల వర్జ్యం: సా. 5-03 నుంచి 6-47 వరకు అమృత ఘడియలు: తె. 3-30 నుంచి 5-15 వరకు దుర్ముహూర్తం: సా. 3-58 నుంచి 4-44 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ.6.00; సూర్యాస్తమయం: సా.5.30
W.G: కాళ్ళ మండలం కాళ్లకూరులో వేంచేసి ఉన్న స్వయంభూః శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక శనివారం పురస్కరించుకుని అంగరంగ వైభవంగా అష్టోత్తర శతనామార్చన, సహస్రదీపాలంకరణ సేవ, ఉంజల్ సేవ జరిపారు. శ్రీ స్వామివారి దేవాలయం తెల్లవారుజాము నుంచి భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగించారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు.
VSP: హరే కృష్ణ ఉద్యమ వ్యవస్థాపకులు శ్రీశ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి 48వ తిరోభావ దినోత్సవం, దామోదర దీపోత్సవం శనివారం సాయంత్రం భీమిలిలోని ఐఐఎం రోడ్లోని హరే కృష్ణ వైకుంఠంలో అంగరంగ వైభోగంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీశ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులవారి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు.
AKP: ప్రతీ హిందూ పండగలో ఓ పరమార్ధం దాగి ఉంటుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. నాగుల చవితి పండగ సందర్భంగా అచ్యుతాపురం మండలం మల్లవరం గ్రామంలో జాజులమ్మ తల్లి ఊరేగింపులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా జాజులమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. నాగుల చవితి పర్వదినం రోజున అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నేడు భక్తి శ్రద్ధలతో తులసి దళార్చన నిర్వహించారు. ఈ పూజలో ఉభయధాతలు, అర్చకులు, వేదపండితులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం పరిసరాలు భక్తుల తోరణాలతో కాంతివంతమయ్యాయి. భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వచ్చి ఆశీర్వాదాలు పొందారు.
HYD: నాగుల చవితి సందర్భంగా ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలోని శ్రీ శివాలయం ఆవరణలో గల నాగదేవతల ఆలయంలో పూజలు నిర్వహించారు. భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి, నాగదేవతలకు, జంట నాగులకు పాలతో అభిషేకం చేశారు. పాము పుట్టలో పాలు పోసి, పుట్టపై పసుపు కుంకుమలను చల్లారు. పువ్వులతో, పత్తి వస్త్రంతో అలంకరించి, దీప ధూపాలని వెలిగించి, నైవేద్యం సమర్పించారు.
కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చే చవితిని నాగుల చవితి అంటారు. ఇవాళ నాగుల చవితి సందర్భంగా భక్తులు దేవాలయంలోని పుట్ట దగ్గరికి వెళ్లి పూజలు చేయాలి. పుట్ట మీద పసుపు నీళ్లు చల్లి.. తర్వాత బియ్యపు పిండి, పసుపు, కుంకుమ చల్లాలి. ఆ తర్వాత దీపం వెలిగించి, పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరించి పుట్టలో ఆవుపాలు పోయాలి. అనంతరం పుట్ట మీద ఉండే కుంకుమతోపాటు మట్టితో బొట్టు పెట్టుకోవాలి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తిక మాసం, శుక్లపక్షం చవితి: రా. 12-01 తదుపరి పంచమి జ్యేష్ఠ: పూర్తి వర్జ్యం: మ. 12-02 నుంచి 1-48 వరకు అమృత ఘడియలు: రా. 10-37 నుంచి 12-23 వరకు దుర్ముహూర్తం: ఉ. 5-59 నుంచి 7-31 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ.5.59; సూర్యాస్తమయం: సా.5.31 నాగుల చవితి
VSP: సింహాచలం దేవస్థానం ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్. సుజాత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆమె అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పరిధిలో కప్పస్తంభం ఆలింగనం చేసి, బేడా ప్రదక్షిణం నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రధానాలయంలో దర్శనం చేసుకుని, వేదపండితుల వేదాశీర్వచనాలు స్వీకరించారు.
SRD: ఏడుపాయల వనదుర్గ భవాని దేవస్థానం నందు కార్తీక మాసం శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాపన్నపేట మండలం పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం కార్తీక మాసం పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రదోషకాల పూజ అనంతరం భక్తులకు ఆకాశ దీపం దివ్య దర్శనం కల్పించారు.
KKD: ప్రత్తిపాడులోని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కొండపైన Laurus సంస్థ సౌజన్యంతో నిర్మించిన షెడ్డును ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభ శుక్రవారం ప్రారంభించారు. అలాగే భక్తుల కోసం దర్శనం, వ్రత, ప్రసాద విక్రయ కేంద్రాలు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
TPT: తిరుమలలో అక్టోబర్ 25వ తేదీన నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునిదే.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తికమాసం, శుక్లపక్షం తదియ: రా10-01 తదుపరి చవితి అనూరాధ: తె5-51 తదుపరి జ్యేష్ఠ వర్జ్యం: ఉ7-42 నుంచి 9-29 వరకు అమృత ఘడియలు: సా6-20 నుంచి 8-07 వరకు దుర్ముహూర్తం: ఉ8-17 నుంచి 9-03 వరకు తిరిగి మ12-08 నుంచి 12-54 వరకు రాహుకాలం: ఉ10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ5.59; సూర్యాస్తమయం: సా5.31 స్వాతికార్తె రా8.18
AP: 2026 జనవరి నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ ఆన్లైన్లో విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు అధికారులు ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు దర్శన టికెట్లు విడుదల చేస్తారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తికమాసం, శుక్లపక్షం విదియ: రా7-55 తదుపరి తదియ; విశాఖ: తె3-16 తదుపరి అనూరాధ; వర్జ్యం: ఉ6-53 నుంచి 8-39 వరకు; అమృత ఘడియలు: సా5-31 నుంచి 7-17 వరకు; దుర్ముహూర్తం: ఉ9-49 నుంచి 10-35 వరకు తిరిగి మ2-26 నుంచి 3-13 వరకు; రాహుకాలం: మ1-30 నుంచి 3-00 వరకు; సూర్యోదయం: ఉ.5.58; సూర్యాస్తమయం: సా.5.32 భగినీ హస్త భోజనం, చంద్ర దర్శనం