TG: యాదగిరిగుట్టపై శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం శ్రీకృష్ణాలంకారంలో నరసింహస్వామి మురళీకృష్ణుడిగా దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా రాత్రికి స్వామివారికి పొన్న వాహనసేవ నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం పంచమి: మ.12:09 తదుపరి షష్ఠి; అశ్విని: రా.7:01 తదుపరి భరణి; వర్జ్యం: మ.3:13 నుంచి 4:45 వరకు; తిరిగి తె.4:02 నుంచి 5:32 వరకు; అమృత ఘడియలు: మ.12:11 నుంచి 1:42 వరకు; దుర్ముహూర్తం: సా.4:27 నుంచి 5:13 వరకు; రాహుకాలం: సా.4:30 నుంచి 6:00 వరకు సూర్యోదయం: ఉ.6:28; సూర్యాస్తమయం: సా.6:00.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం చవితి: మ.2:00 తదుపరి పంచమి రేవతి: రా.8:15 తదుపరి అశ్విని వర్జ్యం: ఉ.8:44 నుంచి 10:16 వరకు అమృత ఘడియలు: సా.5:57 నుంచి 7:29 వరకు దుర్ముహూర్తం: ఉ.6:28 నుంచి 8:00 వరకు రాహుకాలం: ఉ. 9:00 నుంచి 10:30 వరకు సూర్యోదయం: ఉ.6.28; సూర్యాస్తమయం: సా.5:59.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10-12 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండటంతో భక్తులు కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లో ఉన్నారు. నిన్న శ్రీవారిని 57,682 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,020మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
TG: యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు మూడోరోజు కొనసాగుతున్నాయి. ఉదయం స్వామివారికి మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు స్వామివారికి శేషవాహన సేవ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు కనువిందు చేయనున్నాయి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం తదియ: మ.3:33 తదుపరి చవితి ఉత్తరాభాద్ర: రా.9:13 తదుపరి రేవతి వర్జ్యం: ఉ.7:11 నుంచి 8:44 వరకు అమృత ఘడియలు: సా.4:32 నుంచి 6:06 వరకు దుర్ముహూర్తం: ఉ.8:46 నుంచి 9:33 వరకు తిరిగి మ.12:37 నుంచి 1:22 వరకు రాహుకాలం: ఉ.10:30 నుంచి 12:00 వరకు సూర్యోదయం: ఉ.6:29; సూర్యాస్తమయం: సా.5:59.