తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. భక్తులు సర్వదర్శనం కోసం 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 76,506 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,049 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.