ATP: అనంతపురం లలితకళా పరిషత్లో నేడు నిర్వహించనున్న “బీసీ గళం” సభ పనులను వైసీపీ నేతలు పరిశీలించారు. కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సభ జరగనుంది. బీసీల హక్కుల కోసం జరిగే ఈ పోరాట సభకు ప్రజలు, మేధావులు అధిక సంఖ్యలో తరలిరావాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.