విజయనగరం: గొడిపాలెం-పేడాడ-బంటుపల్లి మార్గంగా భోగాపురం వెళ్లే రహదారి గుంతలతో పూర్తిగా దెబ్బతింది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.