ATP: శింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ చేపట్టిన “మన గ్రామానికి మన శైలజానాథ్” కార్యక్రమం నేడు ఏడవులపర్తిలో జరగనుంది. సాయంత్రం 6:00 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో శైలజానాథ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ క్యాంపు కార్యాలయం కోరింది.