ASR: రాజవొమ్మంగి జాతీయ రహదారిపై శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఒట్టిగెడ్డ సమీపంలో గంగవరం మండలం మర్రిపాలెంకు చెందిన రవికిశోర్ రెడ్డి (21), శేఖర్ గోపాల్ రెడ్డి బైక్పై వెళ్తుండగా పశువులు అడ్డువచ్చాయి. ఈ ఘటనలో ఇద్దరూ కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన రవికిశోర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన గోపాల్ రెడ్డిని అడ్డతీగల ఆసుపత్రికి తరలించారు.