సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా చూడకుండానే అనుమతి ఇచ్చారని మండిపడింది. కేరళ స్టోరీ-2 సినిమాపై హైకోర్టు స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. దీంతో రేపు విడుదల కావాల్సిన ఈ చిత్రం నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ను కూడా వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2026 మార్చి 26న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా మార్చి 9 తర్వాత పవర్ ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ మార్కు డైలాగులు సినిమాలో హైలైట్ కానున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశిఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కుటుంబ కలహాలపై నటి హేమ మాలిని ఎట్టకేలకు స్పందించింది. నటుడు ధర్మేంద్ర మరణం తర్వాత సన్నీ డియోల్, బాబీ డియోల్లతో తనకు విభేదాలు తలెత్తాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తామంతా ఒకే కుటుంబంగా కలిసి ఉన్నామని స్పష్టం చేసింది. ఈ పుకార్లలో నిజం లేదని చెబుతూ వివాదాలకు చెక్ పెట్టింది.
జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డ్రాగన్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ అతిథి పాత్ర చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే ఓ సన్నివేశంలో అఖిల్ కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘విష్ణు విన్యాసం’. FEB 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా రన్ టైం లాక్ అయింది. ఈ మూవీ 1:59 గంటల నిడివితో థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన ఈ మూవీకి రధన్ మ్యూజిక్ అందించాడు.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం హిందూ, కొడవ సంప్రదాయాల్లో ఘనంగా జరుగుతోంది. ఈ రోజు ఉదయం హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుక ముగియగా, సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ ఆచారం ప్రకారం ‘కొడవ’ సంప్రదాయంలో మరోసారి వివాహం జరగనుంది. ఈ కొత్త జంట వెడ్డింగ్ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్లో నిర్వహించనున్నారు.
ప్రభాస్, నాగ్ అశ్విన్ల ‘కల్కి 2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. HYDలోని శంకర్ పల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోన్న షూటింగ్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొన్నారు. వారిద్దరూ ఉదయం నుంచి రాత్రి 9 గంటలకు చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ఎక్కడా అలసట లేకుండా వారు చూపిస్తున్న డెడికేషన్కు యూనిట్ సభ్యులు షాక్ అవుతున్నారట. ఇక ఈ షెడ్యూల్ మార్చి 12 వరకు కొనసాగనుంది.
నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో రాబోతున్న ‘బ్లడీ రోమియో’పై క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం కోసం ముగ్గురు సంగీత దర్శకులను తీసుకోవాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నాడట. యాక్షన్, రోమాన్స్, డ్రామా ఎమోషన్స్కు తగ్గట్టుగా ఒక్కో విభాగానికి ఒక్కో స్పెషలిస్ట్ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్లోనే ఇలా మల్టీపుల్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. కేవలం కామెడీతో చిరంజీవితో సినిమా తీయడం సాహసమని, తొలి సీన్లోనే పాత్రను పరిచయం చేసిన తీరు బాగుందని మెచ్చుకున్నారు. ఈ చిత్రం రూ.400 కోట్లు వసూలు చేసి, కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కావడమే దీని విజయానికి నిదర్శనమని, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారని తెలిపారు.
నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి ప్రాజెక్టును దర్శకుడు శ్రీకాంత్ విస్సాతో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబో ఇప్పటికే లాక్ అయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2026 ద్వితీయార్థంలో ప్రారంభం కానుందట. అదే ఏడాది చివరి నాటికి సినిమాను థియేటర్లలో విడుదల చేసేలా మేకర్స్ పక్కా ప్లాన్తో సిద్ధమవుతున్నట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు తెరదించుతూ, రాజస్థాన్ ఉదయ్పూర్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ మూవీలతో మెప్పించిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటి అవ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
రామ్ చరణ్తో ‘పెద్ది’ మూవీ చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబు, తన తదుపరి మూవీని రెబల్ స్టార్ ప్రభాస్తో చేయనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం బుచ్చిబాబు ఇప్పటికే ఒక సాలిడ్ పాన్ ఇండియా స్క్రిప్ట్ను సిద్ధం చేశాడట. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ఖాయం.
ప్రముఖ నటి రన్యా రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రూ.102 కోట్ల విలువైన భారీ బంగారం స్మగ్లింగ్ కేసులో ఆమెపై ఈడీ సంచలన ఆరోపణలు చేస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏడాది కాలంలో సుమారు 127 కిలోల బంగారాన్ని అక్రమంగా భారత్కు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
నటి దివ్య శ్రీపాద, అభయ్ నవీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిన్న బడ్జెట్ రొమాంటిక్ డ్రామా ‘చరిత కామాక్షి’. 2021లో ప్రకటించిన ఈ చిత్రం ద్వారా శ్రీలంక చందు సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘’ఈటీవీ విన్’లో మార్చి 5, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
వంశీ తుమ్మల, సంధ్య వశిష్ఠ జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీచిదంబరంగారు’. ఈనెల 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇవాళ్టి నుంచి ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దర్శకుడు వేణు ఈ సినిమాపై మాట్లాడుతూ ‘నిజమైన వైకల్యం అంటే శరీరానికి ఉన్నది కాదు, వ్యక్తిత్వం లేకపోవడమే అని ఈ సినిమాలో హృద్యంగా చూపించారు’ అని పేర్కొన్నారు.