హీరోయిన్ నిధి అగర్వాల్పైకి అభిమానులు దూసుకెళ్లి సెల్ఫీల కోసం ఎగబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేసింది. ‘వీళ్లు మగాళ్లు కాదు.. జంతువులు. వాటి కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి మానవ మృగాళ్లను వేరే గ్రహానికి పంపాలి’ అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
‘అవతార్ 3’ మూవీపై దర్శకుడు సుకుమార్ రివ్యూ ఇచ్చాడు. ‘సినిమా అద్భుతంగా ఉంది. 3:17 గంటలు నాకు క్షణాల్లో అయిపోయాయి. చుట్టూ అన్ని మరిచిపోయి పండోర ప్రపంచానికి వెళ్లిపోయాను. తెలుగు సినిమాల్లో ఉన్న అన్నీ ఎమోషన్స్ ఉన్నాయి. ఆ విజువల్స్, పాత్రలు నా మైండ్లో నుంచి వెళ్లట్లేదు. మూవీ అంటే ఇది అనిపించింది. జేమ్స్ కామెరూన్ మూవీలను మనం థియేటర్లలో చూస్తేనే ఎంజాయ్ చేయగలం’ అని తెలిపాడు.
తన ఫొటోలను కొందరు AI టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి నెట్టింట అసభ్యకరంగా వైరల్ చేయడంపై నటి నివేదా థామస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చట్టవిరుద్ధమని, తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించడమేనని పేర్కొంది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదని కోరింది.
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరో కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు. నందమూరి బాలకృష్ణ చేసే అన్స్టాపబుల్ షో తరహాలో మరో అదిరిపోయే షోతో సిద్ధూ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనతో ఓ ప్రముఖ OTT సంస్థ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. 2026 సంక్రాంతి కానుకగా ఈ షో ప్రారంభం కానుందట. సిద్ధూ హోస్ట్గా వ్యవహరించనున్న ఈ షో తెలంగాణ యాస ఒట్టి పడేలా ఉండనున్నట్లు టాక్.
‘అవతార్’ ఫ్రాంఛైజీ నుంచి రాబోతున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రేపు విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వరల్డ్ వైడ్గా మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.3000 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టనున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
ఆస్కార్ అకాడమీ, యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పాయి. మరో 3ఏళ్ల తర్వాత యూట్యూబ్లో ఆస్కార్ అవార్డుల వేడుకలు టెలికాస్ట్ కానున్నాయి. 1976 నుంచి ఆస్కార్ ప్రసార హక్కులను కలిగిన ఏబీసీ సంస్థ ఒప్పందం 2028లో జరిగే 100వ వేడుకతో ముగుస్తుంది. దీంతో 2029-2033 వరకు గ్లోబల్ స్ట్రీమింగ్ హక్కులను అకాడమీ యూట్యూబ్కి ఇచ్చింది. కాగా, 98వ ఆస్కార్ వేడుక 2026 మార్చి 15న జరగనుంది.
అల్లుఅర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘AA 22’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అట్లీ నిర్ణయం తీసుకున్నారని, స్క్రిప్ట్పరంగా కూడా మార్పులు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది దసరాకు సినిమా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో ‘ది రాజాసాబ్’ మూవీ తెరకెక్కింది. అయితే నిర్మాత TG విశ్వప్రసాద్ ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చారు. రాజాసాబ్ స్పెషల్ ప్రీమియర్స్ జనవరి 8న వేయబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే HYD ఓపెన్ గ్రౌండ్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. త్వరలోనే ఈవెంట్ తేదీని వెల్లడిస్తామని తెలిపారు.
టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూశాడు. గతంలో అక్కినేని నాగార్జునతో కిరణ్ ‘కేడి’ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆయన తాజాగా దర్శకత్వం వహించిన ‘కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆ సినిమా విడుదల కాకముందే కిరణ్ చనిపోవడం బాధాకరమని పలువురు పేర్కొంటున్నారు.
ఇటీవలే ‘డ్యూడ్’ సినిమాతో హిట్ అందుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్ మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తన స్వీయ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని AGS ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2’ మూవీ మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ను APలోని అమరావతిలో రేపు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మేకర్స్తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో ‘జైలర్ 2’ చిత్రం రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె ఈ మూవీ షూటింగ్లో కూడా జాయిన్ అయినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ధరల హైక్స్తో రిలీజైన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో ఈ మూవీ టికెట్ ధరలు నార్మల్కు రాగా.. APలో ఇవాళ్టి నుంచి సాధారణ టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో APలో ఈ సినిమా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా నటించిన మూవీ ‘హోమ్బౌండ్’. తాజాగా ‘ఆస్కార్ 2026’ షార్ట్ లిస్ట్లో ఈ మూవీ చోటు దక్కించుకుంది. ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్’ విభాగంలో భారత్ తరపున ఇది ‘ఆస్కార్ 2026’ బరిలో దిగింది. ఇక వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో స్నేహం, వివక్ష, ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే పోటీ, కోవిడ్ కష్టాల...
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వశిష్ఠ కాంబోలో సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రవితేజకు వశిష్ఠ కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2026 అర్ధభాగంలో స్టార్ట్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందట. కాగా, ప్రస్తుతం రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో, వశిష్ఠ ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు.