• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక

పింక్ సిటీ జైపూర్ వేదికగా ఐఫా అవార్డుల వేడుక ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలో నిన్న OTTలో మంచి ఆదరణ దక్కించుకున్న మూవీలు, సిరీస్‌లకు అవార్డులు ఇచ్చారు. ఉత్తమ చిత్రంగా అమర్ సింగ్ చంకీలా, ఉత్తమ సిరీస్‌గా పంచాయత్ సీజన్ 3లు అవార్డులు అందుకున్నాయి. ఉత్తమ నటుడిగా విక్రాంత్ మాస్సే(సెక్టార్ 36), నటిగా కృతి సనన్ (దో పత్తి)గా నిలిచారు.

March 9, 2025 / 11:12 AM IST

‘జిగ్రా’ పరాజయంపై అలియా భట్ స్పందన

‘జిగ్రా’ సినిమా పరాజయంపై బాలీవుడ్ నటి అలియా భట్ స్పందించారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దానికి ఆదరణ లభించకపోయినా తాను ఉత్సాహంగానే ఉన్నట్లు చెప్పారు. ఆ సినిమా నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నట్లు తెలిపారు. సినిమా ఫలితాలు తనని ప్రభావితం చేయవు అని, సినీ రంగంలో జయాపజయాలు సహజమని పేర్కొన్నారు.

March 6, 2025 / 11:25 AM IST

OTTలోకి శర్వా ‘మనమే’.. ఎప్పుడంటే?

టాలీవుడ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమా రిలీజై దాదాపు 9నెలలు పూర్తయినా.. ఇప్పటివరకు OTTలోకి రాలేదు. అయితే ఈ సినిమా OTTలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

March 3, 2025 / 11:20 AM IST

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. తన ప్రియుడు, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా 2023లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

February 28, 2025 / 02:17 PM IST

అందుకే ఆ పాత్రను అలా చూపించాను: సందీప్ వంగా

‘యానిమల్’ సినిమాలో విలన్‌గా నటించి బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే ఈ మూవీలో విలన్ పాత్రను అలా చూపించడంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ‘ప్రతి సినిమాలో హీరో, విలన్ మధ్య మాటల యుద్ధాలు చూస్తూనే ఉంటాం. అందుకే కాస్త విభిన్నంగా చూపించాలనే ఉద్దేశంతోనే ఆ పాత్రను అలా క్రియేట్ చేశా’ అని చెప్పారు. 

February 28, 2025 / 11:20 AM IST

‘రంగస్థలం’.. ఆ సీన్ వల్ల భయమేసింది: ఆది

నటుడు ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రంగస్థలం సినిమా తనకు తెలుగు, తమిళంలో మంచి పేరు తెచ్చినట్లు చెప్పాడు. ‘రంగస్థలం ఇప్పుడు విడుదలయ్యుంటే పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందేది. ఆ మూవీలో నేను చనిపోయినట్లు నటించిన సన్నివేశం ఉంది. అప్పుడు నా చుట్టూ ఉన్న నటీనటుల యాక్టింగ్ చూసి చాలా భయం వేసింది. థియేటర్లో ఆ సీన్ చూసి మా నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు’ అని చెప్పుకొచ్చాడు.

February 26, 2025 / 11:25 AM IST

వారి వారసులకు సారీ చెప్పిన దర్శకుడు

ఛావా సినిమాలో తమ పూర్వీకులను తక్కువ చేసి చూపించారని గానోజీ, కన్హోజీ షిర్కే వారసులు ఆరోపించారు. దీనిపై దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ స్పందించారు. ‘వారి కుటుంబీకులకు క్షమాపణలు చెబుతున్నా. గానోజీ, కన్హోజీలను తప్పుగా చూపించే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. అందుకే వారికి సంబంధించిన వివరాలు, వారు ఏ ప్రాంతానికి చెందినవారు అనే అంశాలను ఎక్కడా చూపించలేదు’ అని పేర్కొన్నారు.

February 24, 2025 / 02:26 PM IST

OTTలో అదరగొడుతోన్న ‘డాకు మహారాజ్’

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ OTTలో అదరగొడుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోన్న సినిమాల్లో ఇది టాప్‌లో నిలిచింది. అలాగే బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, పాకిస్తాన్ తదితర దేశాల్లో టాప్ 2‌లో ట్రెండ్ అవుతోంది. ఇక బాబీ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజై రూ.170 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.

February 23, 2025 / 02:27 PM IST

‘ఛావా’కు పన్ను మినహాయింపు.. ఎక్కడంటే?

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాలు దీనికి పన్ను మినహాయింపు ప్రకటించాయి. మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించింది.

February 20, 2025 / 11:24 AM IST

ఒంటరితనం భయంకరంగా ఉంటుంది: సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీ వైరల్ అవుతోంది. ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుందని తెలిపింది. అయితే, మౌనంగా ఉండటం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుందని చెప్పుకొచ్చింది. ఫోన్ లేకుండా, ఎవరితో మాట్లాడకుండా మూడు రోజులు ధ్యానంలో ఉంటానంటూ పోస్ట్ పెట్టింది.

February 20, 2025 / 08:28 AM IST

ఆలియా భట్ అరుదైన ఘనత

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ అరుదైన ఘనత సాధించింది. ఇన్‌స్టాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన నటీమణుల జాబితాలో ఆమె రెండవ స్థానాన్ని దక్కించుకుంది. పలువురు హాలీవుడ్ దిగ్గజ హీరోయిన్లను ఆమె వెనక్కునెట్టింది. ఈ విషయాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ హైప్ ఆడిటర్ ప్రకటించారు. కాగా, ఆలియాకు ఇన్‌స్టాలో 85 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

February 17, 2025 / 11:26 AM IST

పెళ్లి చేసుకున్న ప్రముఖ హీరోయిన్

ప్రముఖ హీరోయిన్ ప్రియా బెనర్జీ పెళ్లి పీటలెక్కారు. ప్రియుడు, బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో ఏడడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. కాగా, ప్రియా బెనర్జీ.. తెలుగులో జోరు, కిస్ తదితర సినిమాలతో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్‌లో నటించారు.

February 15, 2025 / 02:28 PM IST

ప్రముఖ నటుడి ఇంట్లో విషాదం

ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ చనిపోయారు. ఈ విషయాన్ని తెలుపుతూ రాహుల్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అలాగే తన మామయ్య చనిపోయారని సింగర్ చిన్మయి వెల్లడించారు.

February 14, 2025 / 11:29 AM IST

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటుడు పృథ్వీ

TG: టాలీవుడ్ నటుడు పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రెండ్రోజులుగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. ఫోన్‌కాల్స్, మెసేజ్‌లతో తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా పృథ్వీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

February 12, 2025 / 05:17 PM IST

బన్నీని అన్‌ఫాలో చేసిన రామ్ చరణ్

ఇన్‌స్టాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేశారు. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సాయి దుర్గా తేజ్ బన్నీని అన్‌ఫాలో చేయగా.. తాజాగా చరణ్ కూడా చేశారు. కొంత కాలంగా అల్లు, మెగా కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

February 12, 2025 / 02:23 PM IST