బాక్సాఫీస్ వద్ద రూ. 1800 కోట్ల గ్రాస్తో సంచలనం సృష్టించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జియో హాట్స్టార్ వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ కానుంది. జూన్ 5 నుంచి రెగ్యులర్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది.
విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘స్లమ్డాగ్-33 టెంపుల్ రోడ్’. ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 8న ఈ చిత్ర అఫీషియల్ టీజర్ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందులో సంయుక్త మీనన్, టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘టాక్సిక్’ మూవీ అవుట్పుట్ పట్ల హీరో యష్ అసంతృప్తిగా ఉన్నారని, వందల కోట్ల బడ్జెట్తో మళ్లీ రీషూట్లు చేస్తున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ పుకార్లపై నిర్మాణ సంస్థ, చిత్ర బృందం తీవ్రంగా స్పందించాయి. SMలో వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్లేనని కొట్టిపారేశాయి. సినిమా చిత్రీకరణ ఇప్పటికే విజయవంతంగా పూర్తయిందని, ఎలాంటి రీషూట్లు జరగడం లేదని స్పష్టం చేశాయి.
కర్ణాటకలో ‘పెద్ది’ సినిమా ప్రభంజనం సృష్టించింది. అక్కడ ప్రీమియర్ షోల ద్వారా రూ.3.2 కోట్ల భారీ వసూళ్లు సాధించి.. అత్యధిక ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది. గతంలో ‘OG’ (రూ.2.72 కోట్లు), ‘రాజాసాబ్’ (రూ.2.61 కోట్లు), ‘పుష్ప 2’ (రూ.2.55 కోట్లు) సాధించిన వసూళ్లను అధిగమించి ‘పెద్ది’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
రామ్చరణ్, జాన్వీకపూర్ జంటగా నటించిన ‘పెద్ది’లోని ‘చికిరి చికిరి’ సాంగ్ 10 కోట్లకు పైగా వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది. AR రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటలోని ‘సరుకూ సామాన్లు’ అనే పదంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మేకర్స్ థియేటర్లలో ఆ పదాన్ని ‘సొగసు సింగారం’గా మార్చినట్లు నెటిజన్లు SMలో పోస్ట్&zwnj...
సోషల్ మీడియాలో ‘పెద్ది’ మేనియా నడుస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ టాక్ తెచ్చుకుంది. బుక్మైషోలో గంటకు 40వేల టికెట్ల బుకింగ్స్తో దూసుకుపోతోంది. అవర్లీ ట్రెండింగ్ ఫీచర్ వచ్చాక.. కల్కి, సలార్, పుష్ప-2 తర్వాత మొదటిరోజే ఈ మైలురాయిని దాటిన నాలుగో చిత్రంగా ‘పెద్ది’ రికార్డు సృష్టించింది.
‘జై భీమ్’ వంటి క్లాసిక్ అందించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్తో సూర్య మరో సినిమా చేయనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా కేవలం రూ.5 ఫీజుతో పేదలకు వైద్యం అందించి, పద్మశ్రీ అందుకున్న ప్రముఖ చెన్నై ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం బయోపిక్ అని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రానున్నమూవీ బడ్జెట్ వల్ల ఆగిపోయిందన్న వార్తలను రైటర్ రత్నకుమార్ ఖండించాడు. ‘విక్రమ్’ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన స్పందిస్తూ.. బన్నీతో మూవీ కోసం ఎదురుచూస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ చిత్ర అధికారిక థీమ్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, ఇన్స్టాలో 3.55 లక్షలకు పైగా రీల్స్తో రికార్డు సృష్టించింది.
గుర్తింపు లేని ఊరి ఆత్మగౌరవం కోసం ఒక క్రికెట్ కూలీ చేసిన పోరాటమే ‘పెద్ది’. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టే పెద్ది, తన గ్రామం కోసం కుస్తీ వైపు ఎందుకు మళ్లాడనేదే కథ. రామ్చరణ్ అద్భుత నటన, భావోద్వేగాలు, క్రీడా సన్నివేశాలు, సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. కొన్ని సినిమాటిక్ సీన్లు, ఫస్టాఫ్లో హీరోయిన్ ట్రాక్ కాస్త మైనస్. రేటింగ్:3.25/5.
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నటి కీర్తి సురేష్.. ప్రస్తుతం కన్నెవెడి, రఫ్తార్ వంటి చిత్రాలతో బిజీగా ఉంది. అయితే, ఈ బ్యూటీ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ హిందీ దర్శకుడితో భారీ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా కోసం చర్చలు జరుపుతోందట. కీర్తి కెరీర్లో మునుపెన్నడూ చూడని సరికొత్త జానర్లో ఈ సినిమా ఉండబోతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన పెద్ది మూవీ ప్రీమియర్ షో పడింది. మూవీలో రామ్ చరణ్ బాడీ బిల్డింగ్, నటన అదిరిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. హీరోయిన్ జాన్వీ కపూర్ అందాలు కనువిందు చేశాయన్నారు. సాంగ్స్, రామ్చరణ్ డ్యాన్స్ బాగున్నాయని పేర్కొన్నారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ‘మేజర్’ విడుదలై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో అడవి శేష్ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. సినిమా చూసి స్ఫూర్తి పొందిన ఓ 7 ఏళ్ల బాలుడు సందీప్ మ్యూజియంను సందర్శించాడని ఆయన తల్లి చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ చిత్రం ద్వారా మరికొన్ని లక్షల మందికి మేజర్ వీరత్వం తెలియడం తనకు ఎంతో గర్వకారణమని శేష్ ఆనందం వ్యక్తం చేశాడు.
రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఫస్ట్ హాఫ్తో ఆకట్టుకుంది. కథా నేపథ్యం విలేజ్ బ్యాక్ డ్రాప్తో మొదలవుతుంది. ‘రై రై రా రా’ పాటలో చరణ్ డ్యాన్స్ కంటికి పండగలా అనిపిస్తుంది. జాన్వీ ఎపిసోడ్స్ పరవాలేదనిపించగా, ‘వన్ రుపీ’ క్రికెట్ సీక్వెన్స్, ఎమోషనల్ ప్రీ-ఇంటర్వెల్ సీన్స్.. సెకండ్ హాఫ్పై భారీ అంచనాలు పెంచేసాయి. పూర్తి రివ్యూ కోసం HIT TV న్యూస్ను ఫాలో...
తిరుపతిలోని శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, సినీ గాయకులు శ్రీకృష్ణ, శృతి రంజని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి అధికారులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వారు రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు, స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను అందజేశారు.