ఉగాది పండుగ వేళ నటుడు చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు మరో సరికొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాడు. భవిష్యత్లో పేద పిల్లలకు ఉచిత విద్య అందించడమే లక్ష్యమని తెలిపాడు. పండుగని పురస్కరించుకుని పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ అంశాన్ని వెల్లడించాడు.
యంగ్ హీరో ఆది సాయి కుమార్ లేటెస్ట్ మూవీ ‘ఇగో రాజా’. గురు సరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఆది ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ను ట్యాగ్ చేస్తూ.. ‘ఆది తన కెరీర్లోనే అత్యంత అగ్రెసివ్ అవతార్లో కనిపించనున్నాడు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’ అని చిత్రయూనిట్ రాసుకొచ్చింది.
పరాభవ నామ సంవత్సరంలో ప్రతిఒక్కరికీ అన్నీ శుభాలే జరగాలని ప్రముఖ నటుడు చిరంజీవి ఆకాంక్షించాడు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని SM వేదికగా అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. అధర్మం, అహంకారాలకు.. ధర్మం చేతిలో పరాభవం జరిగి.. శాంతి, స్నేహం, ప్రేమ జయించాలని కోరాడు. అలాగే ప్రముఖ హీరో అల్లు అర్జున్తో పాటు పలువురు సినీ ప్రముఖులు అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఈ మూవీకి సీక్వెల్గా ధురంధర్ 2 తెరకెక్కించారు. ఈ రెండు పార్ట్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ధురంధర్2 సినిమా క్లైమాక్స్లో పార్ట్3 ఉన్నట్లు చిత్రయూనిట్ హింట్ ఇచ్చేసింది. అంతేకాకుండా జూన్ 14, 2026 విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
NTR అభిమానులకు ఉగాది వేళ గుడ్ న్యూస్. NTR పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఆయన స్టైలిష్ యాక్షన్ మూవీ ‘ఊసరవెల్లి’ని రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని తారక్ మ్యానరిజమ్స్, సాంగ్స్ అప్పట్లో సెన్సేషన్. ఇప్పుడు మళ్లీ వెండితెరపై ‘టోనీ’ మ్యాజిక్ చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధం కానున్నారు.
రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్-2’ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ ద్వారానే రూ.75 కోట్లు వచ్చినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. భారత్లోనే రూ.52.50 కోట్లు వచ్చింది. ఓవర్సీస్లో ప్రీమియర్స్తోనే హయ్యెస్ట్ కలెక్షన్లు రూ.23 కోట్లు సాధించిన ఇండియన్ సినిమాగానూ నిలిచింది. ఈ క్రమంలో OG రూ.25 కోట్లు, యానిమల్ రూ.11 కోట్లను వెనక్కి నెట్టింది.
ధురంధర్-2 సినిమాలో దేశభక్తిని చాలా స్టైలిష్గా చూపించారని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పేర్కొన్నాడు. మూవీలో చప్పట్లు కొట్టించే సీన్స్ ఎన్నో ఉన్నాయని.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదొక బ్లాస్ట్ అంటూ ప్రశంసించాడు. రణ్వీర్ లాంటి నటుడు మన దేశంలో ఉండటం గర్వకారణమని, మాధవన్ సహా అందరూ అదరగొట్టారని కొనియాడాడు. భారతీయ కథను అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా తెరకెక్కించారన్నాడు.
ఈ ఏడాది అనుష్క శెట్టి పెళ్లంటూ వస్తున్న రూమర్స్ను ఆమె టీమ్ కొట్టిపారేసింది. SM వేదికగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదని ప్రకటించింది. సమాచారం లేకుండా ఎలాంటి వార్తలను పబ్లిష్ చేయొద్దని మీడియాను కోరింది. అనుష్క ఏజ్కు సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం ఆమె ప్రైవసీకి భంగం కలిగించడమేనని పేర్కొంది. వ్యక్తిగత విషయమైన పెళ్లిపై ఇలా రూమర్స్ సృష్టించడం సరికాదని తెలిపింది.
పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో దశాబ్దం తర్వాత థియేటర్లలోకి వచ్చిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హీరో ఎలివేషన్స్, డైలాగ్స్, తమన్ మ్యూజిక్ అభిమానులను అలరిస్తాయి. కానీ, అక్కడక్కడా పవన్ సినిమా చూస్తున్న ఫీల్ రాకపోవడం, రోటిన్ సీన్స్ మైనస్గా చెప్పుకోవచ్చు. మొత్తంగా పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ని ఇష్టపడేవారికి ఇది ఒక ట్రిబ్యూట్ మూవీలా అనిపిస్తుంది. రేటింగ్: 3/5
నేషనల్ జియోగ్రాఫిక్-2026 సంవత్సరానికి గాను ’33 మంది గ్లోబల్ ఛేంజ్ మేకర్స్’ జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతీయ నటీమణులు అలియా భట్, ప్రియాంక చోప్రాకు చోటు లభించింది. పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తున్నందుకు అలియాను ఈ గౌరవం వరించింది. అలాగే ఆరోగ్య సంరక్షణ, ముఖ్యంగా డయాబెటిస్ పట్ల అవగాహన పెంచేందుకు ప్రియాంక చేస్తున్న కృషిని నెట్ జియో గుర్తించింది.
రణ్వీర్ సింగ్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్ 2: ది రివెంజ్’ మూవీలో నటి యామీ గౌతమ్ ‘డాక్టర్ షాజియా బానో’గా సర్ప్రైజ్ రోల్లో మెరవనుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆమె పాత్ర కథను మలుపు తిప్పనుందని సమాచారం. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ నటించిన ఈ క్రేజీ సీక్వెల్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
పాకిస్తాన్లో స్పైగా రణ్వీర్ సింగ్ సాగించే మైండ్ గేమ్, యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదించినా, సెకండాఫ్, క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. రణ్వీర్ నటన, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. స్పై థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన భారీ స్పై థ్రిల్లర్ మూవీ ధురంధర్ 2 ప్రీమియర్ షోలపై నెలకొన్న డైలమాపై మేకర్స్ స్పందించారు. ఇప్పటికే హిందీ వెర్షన్ ప్రీమియర్ షోలు నడుస్తున్నాయిని.. తమిళ్, తెలుగు ప్రీమియర్ షోలు రాత్రి 9 గంటల నుంచి ప్రారంభవుతాయని ప్రకటించారు. మలయాళం, కన్నడలో రేపు ఉదయం నుంచి షోలు పడతాయన్నారు. కాగా ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించాడు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు మహేష్ ఆచంట వైపు హీరోయిన్ శ్రీలీల సీరియస్ లుక్స్ SMలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ఘటనపై శ్రీలీల వివరణ ఇచ్చింది. తన ఫోన్ మహేష్ దగ్గర ఉందని.. అందుకే తాను వెనక్కి చూసినట్లు అతడు అనుకున్నాడని తెలిపింది. కానీ ఏదో శబ్ధం వచ్చినట్లు అనిపించడంతోనే తాను వెనక్కి చూశానని.. అంతకుమించి ఏదీ లేదని స్పష్టం చేసింది.