లావణ్య-రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయి అరెస్టయ్యాడు. ఈ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలకు వల వేసి బెడ్రూమ్స్లో కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేశాడు. అతడి హార్డ్డిస్క్లో 300 మంది యువతుల వీడియోలు ఉన్నట్లు సమాచారం. యువతులను డ్రగ్స్కు బానిసలుగా చేసి బెదిరించి వీడియోలతో బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఆ పాత్రకు సంబంధించిన లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది. దీంతో డార్లింగ్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తన సతీమణి శోభితా ధూళిపాళ్ల గురించి అక్కినేని నాగచైతన్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ముఖ్య విషయాల్లో నేను గందరగోళానికి గురైనప్పుడు శోభిత ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అన్ని విషయాల్లో సరైన సూచనలు, సలహాలు ఇస్తుంటుంది. తన నిర్ణయాన్ని నేను ఎంతో గౌరవిస్తా. ప్రతీది ఆమె నిర్ణయం తర్వాతే కార్యరూపం దాలుస్తుంది’ అని పేర్కొన్నారు.
బాక్సాఫీస్ను షేక్ చేసిన పుష్ప-2 ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. రీలోడెడ్ వెర్షన్తో కలిపి ప్రముఖ OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2.. గత డిసెంబర్ 5న రిలీజై రికార్డు కలెక్షన్లు సాధించింది. దాదాపు రూ.1,896 కోట్లు రాబట్టిన ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది.
అజయ్ దేవ్గణ్- కరీనా కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సింగం అగైన్’. గతేడాది నవంబర్లో రిలీజైనా ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం పరాజయం అందుకోవటంపై హీరో అజయ్ దేవగణ్ తాజాగా స్పందించాడు. ఈ మూవీలో జరిగిన తప్పులను భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాయని వెల్లడించాడు. కాగా, ఈ సినిమాలో దీపికా పదుకునే, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఖుషీ కపూర్ ‘లవ్యాపా’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. మూవీ ప్రచారంలో భాగంగా అభిమానులతో ఆమె ముచ్చటించింది. ఈ నేపథ్యంలో అందం కోసం మీరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా? అనే ప్రశ్నకు ఆమె స్పందించింది. ప్లాస్టిక్ సర్జరీ అనేది తన దృష్టిలో ఒక విషయమే కాదని తెలిపింది. అందులో ప్లాస్టిక్ అనే పదం మాత్రమే చూస్తానని పేర్కొంది.
నిజానికి అందరూ అనుకునేంత పూలపాన్పు కాదు సినిమా పరిశ్రమ. దారంతా ముళ్ళు, రాళ్ళు, కనిపించని అగాధాలు, ఊహించని అవరోధాలు అడుగడుగునా పడగలెత్తుతూనే ఉంటాయి. వాటన్నిటినీ, కేవలం సినిమా పట్ల తీరని మక్కువతోనే ఇక్కడందరూ ఎత్తుపల్లాల మధ్యన మునిగితేలుతుంటారనేది పచ్చినిజం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ‘RC 16’ తెరకెక్కుతోంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ నుంచి AR రెహమాన్ తప్పుకున్నట్లు, ఆయనను DSP రీప్లేస్ చేశాడంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై మేకర్స్ స్పందిస్తూ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది ఫేక్ న్యూస్ అని, ఇలాంటి రూమర్స్ను షేర్ చేయొద్దని కోరారు. వీటిని నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ షఫీ కన్నుమూశారు. ఈ నెల 16న గుండెపోటుకు గురైన ఆయన.. కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘వన్ మ్యాన్ షో’ సినిమాతో డైరెక్టర్గా మారిన షఫీ.. దాదాపు 50కి పైగా సినిమాలు తెరకెక్కించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
రానా దగ్గుబాటితో దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వర్మ తన డ్రీమ్ ప్రాజెక్టు ‘బ్రహ్మా రాక్షస’ మూవీ కథను రానాకు వినిపించగా.. కథ నచ్చి సినిమా చేసేందుకు ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం. నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండే ఈ సినిమాలో రానా టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ కీలక పాత్రలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రాబోతున్న స్పై థ్రిల్లర్ ‘ఫ్యామిలీమ్యాన్ 3’. తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా టీం వేడుకను నిర్వహించింది. ఈ సిరీస్లో నటించిన నటీనటులతో పాటు సాంకేతిక బృందం పాల్గొని సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 10ఏళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘పదేళ్ల క్రితం రిలీజైన ‘పటాస్’ మూవీ నా జీవితాన్ని మార్చేసింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతీ మూమెంట్, ప్రతీ క్షణం, ప్రతీ సవాల్ పాఠం నేర్పించాయి. నా జర్నీలో భాగమైన ప్రతిపక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు.
వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ వసూళ్లు రాబడుతోంది. విడుదలైన వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.203+ కోట్లు వసూలు చేసినట్లు చిత్రం బృందం ప్రకటించింది. అమెరికాలోనూ ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తల్లిదండ్రులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించినప్పటికీ అక్కడ జన్మించిన పిల్లలకు పౌరసత్వం ఇచ్చేలా అమెరికన్ చట్టాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇవాళ్టి నుంచి అలాంటి జన్మహక్కును ఫెడరల్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదని ట్రంప్ ప్రకటించారు. అక్రమంగా ప్రవేశించిన ఏలియన్స్ ఏరివేత కోసం పరిశీలన, స్క్రీనింగ్ చేపడతామని తెలిపారు.
హిందీ భాషా రియాలిటీ షో బిగ్ బాస్ 18లో కరణ్ వీర్ మెహ్రా విజయం సాధించారు. కరణ్కు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతిని హోస్ట్ సల్మాన్ ఖాన్ అందించారు. వివియన్ మొదటి రన్నరప్గా నిలిచారు. అయితే ఈ గ్రాండ్ ఫినాలేకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.