రాజమౌళి, మహేష్ బాబుల ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అండర్వాటర్ సీన్స్ కోసం 10 వేల లీటర్ల సామర్థ్యం గల 150 ట్యాంకర్ల నీరు కావాలని హైదరాబాద్ వాటర్ బోర్డుకు చిత్రబృందం షాకింగ్ రిక్వెస్ట్ పెట్టింది. దీంతో నగరంలో నీటి ఎద్దడి దృష్ట్యా బోర్డు నో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ జర్మనీలో శిక్షణలో ఉన్నాడు. మే 18 నుంచి ఈ భారీ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది.
డీమార్ట్ నిర్వాహక సంస్థ ‘అవెన్యూ సూపర్మార్ట్స్’ గత ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి త్రైమాసికంలో రూ. 656.42 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 19.17% అధికం. కంపెనీ ఆదాయం కూడా 18.9% పెరిగి రూ. 17,683 కోట్లకు చేరింది. ఏడాది మొత్తానికి కంపెనీ లాభం రూ. 2,969 కోట్లుగా నమోదై వ్యాపార వృద్ధిని చాటుకుంది.
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఒక బ్రాండ్గా మారాడు. తెలుగులో ‘ది ప్యారడైజ్’ కోసం రూ.15CR, అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ మూవీ కోసం రూ.21CR పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. బాలయ్య-కొరటాల ప్రాజెక్టులోనూ ఆయన పేరే వినిపిస్తోంది. టైర్-2 హీరోలతో సమానంగా అనిరుధ్ రెమ్యూనరేషన్ ఉండటం విశేషం. ఆయన క్రేజ్ చూస్తుంటే త్వరలోనే ఇది రూ.25CR దాటడం ఖాయం.
‘పుష్ప’ మూవీలో కేశవ పాత్రతో మెప్పించిన జగదీష్ ప్రతాప్ బండారి హీరోగా మారుతున్నాడు. హర్ష డైస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘మటన్’ అనే ఆసక్తికర టైటిల్ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అత్యంత వైలెంట్గా ఉండి సినిమాపై అంచనాలు పెంచుతోంది. ‘రక్తం.. శక్తి.. ప్రతీకారం.. వేట మొదలైంది’ అంటూ మేకర్స్ సినిమాపై హైప్ను పెంచారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్-2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం మేకర్స్ రూ.60 కోట్లు కోట్ చేసినట్లు టాక్. పార్ట్-1 రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడంతో ఈ రేటు ఫిక్స్ చేశారట. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీతంతో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 12న విడుదల కానున్నట్లు టాక్
సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఏక్ దిన్’ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమైన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య మే 1న విడుదలై డిజాస్టర్గా నిలిచింది. రెండు రోజుల్లో కేవలం రూ. 2.15 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించి ట్రేడ్ వర్గాలను నిరాశపరిచింది. వరల్డ్ వైడ్ రూ. 2.82 కోట్ల గ్రాస్కే పరిమితమై ఈ సినిమా ఫ్లాప్ దిశగా సాగుతోంది.
కోలీవుడ్ స్టార్ త్రిష నేడు 43వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా హైవేపై తిరుపతి సైన్ బోర్డు చూపిస్తూ ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అని కొందరు, బర్త్ డే కావడంతో మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నారని మరికొందరు చర్చించుకుంటున్నారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ గెలవాలని ఆమె తిరుపతి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘జై హనుమాన్’. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ధురంధర్’ చిత్రంతో పవర్ ఫుల్ విలన్గా మెప్పించిన అక్షయ్, ఇప్పుడు ఈ సోషియో-ఫాంటసీ ప్రాజెక్ట్లో భాగం కావడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ ప్రతిష్టాత్మక మూవీని 2026, జూన్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 17 లేదా 18న సినిమా ట్రైలర్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్తోనే దేశవ్యాప్తంగా ప్రమోషన్లను భారీ స్థాయిలో నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు టాక్.
ప్రేమపై హీరోయిన్ తమన్నా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. జీవితంలో ఎన్నిసార్లయినా ప్రేమలో పడే అవకాశం ఉందని తెలిపింది. అది కేవలం ఒక్కరికే పరిమితం కావాల్సిన అవసరం లేదంటూ పేర్కొంది. బంధాలు.. ఎదుగుదలకు తోడ్పడేలా ఉండాలని.. అలాంటి బంధం దొరికే వరకూ కొత్త బంధాలను వెతుక్కోవాలని వ్యాఖ్యానించింది. నటుడు విజయ్ వర్మతో విడిపోయిన తర్వాత ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.
రామ్ చరణ్ 17వ సినిమా దర్శకుడు సుకుమార్తో ఉండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాపై నయా న్యూస్ బయటకొచ్చింది. ‘పెద్ది’ జూన్లో విడుదలైన వెంటనే, ఏమాత్రం గ్యాప్ లేకుండా చరణ్ ఈ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టనున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు టాక్. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
‘ధురంధర్ 2’ క్లైమాక్స్ కోసం 500 లీటర్ల పెట్రోల్ వినియోగించినట్లు స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ విశాల్ త్యాగి తెలిపారు. అలాగే, 25 కేజీల పేలుడు పదార్థాలను కూడా వాడినట్లు చెప్పారు. సరైన రక్షణ చర్యలు తీసుకుని ఆ చివరి బ్లాస్ట్ సీన్ను చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. షూట్ తర్వాత రణ్వీర్ తన టీమ్ను స్వయంగా మెచ్చుకున్నట్లు వెల్లడించారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్పై లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ‘#SSR61’ అనే వర్కింగ్ టైటిల్తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మేకర్స్.. మే 1న సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టైటిల్, టీజర్ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.