ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబ్ రీనర్, ఆయన భార్య మిచెల్ సింగర్ రీనర్ హత్యకు గురయ్యారు. ఈ ఘాతుకానికి పాల్పడింది వారి తనయుడు నిక్ రీనర్ కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్కు బానిసైన నిక్.. హత్యకు ముందు జరిగిన హాలిడే పార్టీలో రాబ్తో గొడవ పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
తమిళ హీరో శివకార్తికేయన్, దర్శకురాలు సుధా కొంగర కాంబోలో ‘పరాశక్తి’ మూవీ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది పొంగల్ కానుకగా ఇది థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా OTT హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్ను జీ5 రూ.52 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇది శివకార్తికేయన్ కెరీర్లోనే అత్యధికమని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అనే అవార్డును దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఉపాసన SMలో పోస్ట్ పెట్టింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెంట్గా ఉన్న నేపథ్యంలో అవార్డు తీసుకోవడానికి వెళ్లడం లేదని తెలిపింది. నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమా మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన నటి హర్షాలీ మల్హోత్రా గురించి నెటిజన్లు SMలో తెగ వెతుకుతున్నారు. ముంబైకి చెందిన ఈ నటి 4ఏళ్లకే సీరియల్స్లో, ఏడేళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ మూవీలో నటించింది. 2017 తర్వాత నటనకు బ్రేక్ చెప్పి.. దాదాపు 8ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి రెండో వారంలో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. ఒకవేళ జనవరి రెండో వారంలో వస్తే మాత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందట.
హీరో రోషన్, అనస్వర రాజన్ జంటగా ‘ఛాంపియన్’ మూవీ తెరకెక్కుతుంది. ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్కు సంబంధించి స్పెషల్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఛాంపియన్ ప్రపంచంలోకి ప్రయాణం ప్రారంభం కానుంది. రేపు ట్రైలర్ విడుల కానుంది’ అని రాసుకొచ్చారు. కాగా ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తరుణ్ భాస్కర్ ప్రస్తుతం దర్శకత్వంతోపాటు నటుడిగా కూడా రాణిస్తున్నారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బతో కలిసి ఓం శాంతి శాంతి శాంతి: అనే మలయాళ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు.
‘నరసింహ’ రీ-రిలీజ్ వేళ స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్ ఆసక్తికర విషయం చెప్పారు. క్లైమాక్స్లో రజనీ షర్ట్ లేకుండా చేసిన ఫైట్ కంపోజిషన్ చూసి తలైవా ఫిదా అయ్యారట. ఏకంగా ‘డైమండ్స్ గిఫ్ట్గా ఇస్తా.. ఓకేనా’ అని ఆఫర్ చేశారట. కానీ కన్నన్ మాత్రం సున్నితంగా తిరస్కరించి, తనకు వజ్రాలు సెట్ కావని, ఓ రుద్రాక్ష ఇప్పించమని కోరారట. పనిని, మనుషులను గౌరవించడంలో రజనీ ముందుంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. తాజాగా ఈ సినిమాపై క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో మహేష్ తండ్రి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల్లో కూడా మహేష్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన విషయం తెలి...
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్, నటుడు రాబ్ రీనర్ (78), ఆయన సతీమణి మిచెల్ సింగర్ దారుణంగా హత్యకు గురయ్యారు. లాస్ ఏంజెలెస్లోని వారి నివాసంలో అనుమానాస్పద రీతిలో వీరి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. మృతదేహాలపై కత్తిపోట్లు కనిపించడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కాగా, రాబ్ రీనర్కు సపోర్టింగ్ యాక్టర్గా రెండు ఎమ్మీ అవార్డులు లభించాయి.
సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘ఛాంపియన్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల 25న గ్రాండ్గా విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల వేగం పెంచింది. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. రేపు ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు రవీంద్రభారతి వేదికైంది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం రేవంత్ హాజరవుతున్నారు. అయితే విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని హెచ్చరికలు రావడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించనున్నారు. రవీంద్రభారతి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసి, ఎలాంటి గొడవలు జరగకుండా నిఘా పెట్టారు.
బిగ్బాస్ సీజన్-9 తుది దశకు చేరుకుంది. మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఫైనల్కు చేరుకున్న టాప్-5 కంటెస్టెంట్లు ఎవరో తెలిసిపోయారు. తనూజ, డిమోన్ పవన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన నిలిచారు. ఈ వారం జరిగిన డబుల్ ఎలిమినేషన్లో శనివారం సుమన్శెట్టి ఎలిమినేట్ కాగా, ఆదివారం భరణి ఇంటి నుంచి బయటకు వచ్చారు.
‘అఖండ 2’ విజయోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరిని చూసుకుని రా బాలకృష్ణకు అంత పొగరు.. అని చాలా మంది అంటూ ఉంటారు. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు’ అని ఆయన పేర్కొన్నారు. ‘మనం బ్యాట్మ్యాన్, సూపర్మ్యాన్ గురించి మాట్లాడుకుంటాం. ఇది కూడా అలాంటి సినిమానే’ అని తెలిపారు.