రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన భారీ స్పై థ్రిల్లర్ మూవీ ధురంధర్ 2 ప్రీమియర్ షోలపై నెలకొన్న డైలమాపై మేకర్స్ స్పందించారు. ఇప్పటికే హిందీ వెర్షన్ ప్రీమియర్ షోలు నడుస్తున్నాయిని.. తమిళ్, తెలుగు ప్రీమియర్ షోలు రాత్రి 9 గంటల నుంచి ప్రారంభవుతాయని ప్రకటించారు. మలయాళం, కన్నడలో రేపు ఉదయం నుంచి షోలు పడతాయన్నారు. కాగా ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించాడు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు మహేష్ ఆచంట వైపు హీరోయిన్ శ్రీలీల సీరియస్ లుక్స్ SMలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ఘటనపై శ్రీలీల వివరణ ఇచ్చింది. తన ఫోన్ మహేష్ దగ్గర ఉందని.. అందుకే తాను వెనక్కి చూసినట్లు అతడు అనుకున్నాడని తెలిపింది. కానీ ఏదో శబ్ధం వచ్చినట్లు అనిపించడంతోనే తాను వెనక్కి చూశానని.. అంతకుమించి ఏదీ లేదని స్పష్టం చేసింది.
డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ రావడంపై నటి హేమ హర్షం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయితే దోషులేనా?.. జైలుకెళ్లినంత మాత్రాన నేరం చేసినట్టేనా? అని ప్రశ్నించారు. తాను సెలబ్రిటీని కాబట్టే అప్పుడు తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలను పదే పదే చూపించిన ఛానల్స్.. క్లీన్ చిట్ ఇచ్చిన విషయంపై మాత్రం సపోర్ట్ చేయట్టేదన్నారు.
కేడీ: ది డెవిల్ మూవీలోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై సింగర్ మంగ్లీ స్పందించారు. ‘అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. జరిగిన దానికి చింతిస్తున్నాం. ఇలా మరోసారి జరగదు’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను చాలా తక్కువ రోజుల్లో దర్శకుడు హరీష్ శంకర్ పూర్తిచేశాడని మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని తెలిపాడు. హరీష్లా సినిమా తీస్తే తాను ఏడాదికి 10 సినిమాలు తీయవచ్చని అభిప్రాయపడ్డాడు. ఉస్తాద్ సినిమా షూటింగ్ను నిర్మాతగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేశానని.. ఒక పిక్నిక్ తరహాలో గడిచిపోయిందని పేర్కొన్నాడు.
తమిళనాడు రాజకీయాలపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘పాలిటిక్స్లోకి హీరోయిన్లను లాగడం చాలా అసభ్యకరంగా ఉంది. వారికి కుటుంబం, గౌరవం, పర్సనల్ లైఫ్ అనేవి కూడా ఉంటాయి. ప్రజా చర్చ అనేది ప్రాథమిక గౌరవానికి, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదు. ఇక నుంచేనా మనం మంచిగా ప్రవర్తిద్దాం’ అని సూచించారు.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది కానుకగా రేపు విడుదల కానుంది. ఈ సినిమా ఫలితం ఇద్దరి కెరీర్కు కీలకం కానుంది. మిస్టర్ బచ్చన్తో అట్టర్ ఫ్లాప్ చవిచూసి విమర్శలు ఎదుర్కొన్న దర్శకుడు హరీష్ శంకర్కు, ఇటీవల వరుస పరాజయాలతో కెరీర్ గ్రాఫ్ పడిపోతున్న హీరోయిన్ శ్రీలీలకు ఈ సినిమా తప్పక హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘ఎల్లమ్మ’ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ మూవీపై DSP ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎల్లమ్మ’ స్క్రిప్ట్ చెబుతున్న 5 నిమిషాలకే కనెక్ట్ అయిపోయానని తెలిపాడు. తనకు ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు వేణు యెల్దండి, నిర్మాత దిల్ రాజుకు థ్యాంక్స్ చెప్పాడు. గతంలో కూడా చాలామంది యాక్ట్ చేయమని అడిగారని.. కానీ తాను ఎగ్జయిట్ అయ్యే సబ్జెక్ట్ దొరకలేదన్నాడు.
మార్చి 19న ‘ధురంధర్ 2’ విడుదల వేళ దర్శకుడు ఆదిత్య ధర్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. థియేటర్లలోనే మువీ చూసి ఆ మ్యాజిక్ను అనుభవించాలని, మొబైల్స్ లేదా పైరసీలో చూసి తమ కష్టాన్ని వృధా చేయొద్దని కోరాడు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడం కోసం టీం ఎంతో కష్టపడిందన్నాడు. మూవీలో ఊహించని మలుపులు ఉన్నాయని, చూసిన వారు ‘స్పాయిలర్స్’ పంచుకోకుండా ఇతరుల కుతూహలాన్ని కాపాడాలన్నాడు.
హీరోయిన్స్ ప్రాధాన్యం ఉన్న మూవీల్లో నటించేందుకు హీరోలు వెనకడుగు వేస్తున్నారని హీరోయిన్ తాప్సీ చెప్పింది. ఒకప్పుడు తాను కలిసి నటించిన ఓ స్టార్ హీరో, కథలో హీరోయిన్ పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉందని అభద్రతా భావంతో ప్రాజెక్టును తిరస్కరించాడని తెలిపింది. సీనియర్లే కాకుండా, కొత్త హీరోలూ క్రెడిట్ మొత్తం హీరోయిన్కే దక్కుతుందనే భయంతో ఇలాంటి మూవీలకు దూరంగా ఉంటున్నారని పేర్కొంది.
మలయాళ హీరో జయసూర్య, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘కథనార్’. అనుష్క ఈ సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. తాజాగా మేకర్స్ ఈ మూవీపై నయా అప్డేట్ ఇచ్చారు. 2026, మార్చి 31న మధ్యాహ్నం 1:31 గంటలకు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రాన్ని రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్నాడు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. మార్చి 19న హిందీ వెర్షన్ యథావిధిగా విడుదలవుతుండగా, తెలుగు వెర్షన్ మాత్రం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. డబ్బింగ్ పనుల్లో జాప్యం, థియేట్రికల్ ఇష్యూస్ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే తెలుగు ప్రీమియర్ షోలు కూడా రద్దయ్యాయి.
మహేష్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. తాజాగా ఈ సినిమా షూటింగ్పై నయా అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ మూవీకి సంబంధించిన కీలక టాకీ పార్ట్ షూట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య వచ్చే సన్నివేశాలపై చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది.
రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న ‘ధురంధర్ 2’ ప్రీమియర్స్ రద్దయ్యాయి. మార్చి 18న ప్రీమియర్స్ వేయాల్సి ఉండగా, సెకండ్ హాఫ్లో కీలక మార్పుల వల్ల కంటెంట్ ఇంకా థియేటర్లకు చేరలేదు. దీంతో బుక్ మై షో టికెట్లను క్యాన్సిల్ చేసి, 7-8 రోజుల్లో రీఫండ్ చేస్తామని సందేశాలు పంపుతోంది. ఆఖరి నిమిషంలో ఎడిటింగ్ పనుల వల్లే ఈ ఆటంకం ఏర్పడినట్లు సమాచారం.
రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న ‘ధురంధర్ 2’ ప్రీమియర్స్ రద్దయ్యాయి. మార్చి 18న ప్రీమియర్స్ వేయాల్సి ఉండగా, సెకండ్ హాఫ్లో కీలక మార్పుల వల్ల కంటెంట్ ఇంకా థియేటర్లకు చేరలేదు. దీంతో బుక్ మై షో టికెట్లను క్యాన్సిల్ చేసి, 7-8 రోజుల్లో రీఫండ్ చేస్తామని సందేశాలు పంపుతోంది. ఆఖరి నిమిషంలో ఎడిటింగ్ పనుల వల్లే ఈ ఆటంకం ఏర్పడినట్లు సమాచారం.