బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2025లో పేరెంట్స్ అయ్యారు. పండంటి మగబిడ్డకు కత్రినా జన్మనిచ్చింది. తాజాగా వారి కుమారుడి పేరును కత్రినా దంపతులు రివీల్ చేశారు. ‘మా ప్రేమకు ప్రతిరూపం విహాన్ కౌశల్.. మేము చేసిన ప్రార్థనలకు సమాధానం దొరికింది. ఇప్పుడు మా జీవితం ఆనందంగా ఉంది’ అంటూ స్పెషల్ ఫొటోను పంచుకున్నారు. దీంతో నెటిజన్స్ వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ జనవరి 9న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే US మార్కెట్లో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. అదరగొడుతోంది. ప్రీ సేల్స్లో 1 మిలియన్ మార్క్ను దాటేసింది. ఇక ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక పాత్రలు పోషించగా.. తమన్ మ్యూజిక్ అందించాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీ జనవరి 9న రిలీజ్ కానుంది. ఇవాళ ఈ మూవీ ప్రీమియర్స్ షోలు ఉండగా.. తెలంగాణలో ఇంకా ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అయితే టికెట్ ధర పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం పునరాలోచిస్తోంది. ఇప్పటికే టికెట్ ధరలు పెంచాలని నిర్మాత దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వ ఆదేశాల కోసం మేకర్స్తో పాటు అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇటీవల ‘ధురంధర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నటి సారా అర్జున్ అరుదైన ఘనత సాధించింది. ఈ వారం ఎక్కువ ప్రజాదరణ పొందిన ఇండియన్ సెలబ్రిటీల జాబితాను IMDB తాజాగా విడుదల చేసింది. ఈ లిస్టులో స్టార్ హీరోలు ప్రభాస్, అర్జున్ దళపతిని వెనక్కి నెట్టి సారా టాప్లో నిలిచింది. విజయ్ 8వ స్థానంలో ఉండగా.. అగస్త్య నంద 12వ, భాగ్యశ్రీ బోర్సే 15వ, ప్రభాస్ 19వ స్థానాల్లో ఉన్నారు.
తమిళనాట మరోసారి సెన్సార్ వివాదం రాజుకుంది. హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ చిత్రానికి ఇంకా సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. కేంద్రానికి వ్యతిరేక సన్నివేశాలున్నాయన్న ఆరోపణలే ఇందుకు కారణమని టాక్. ఇప్పటికే ఇదే కారణంతో ‘జననాయగన్’ వాయిదా పడగా.. శనివారం విడుదల కావాల్సిన ‘పరాశక్తి’ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సినిమా విడుదలపై సంది...
తమిళనాట మరోసారి సెన్సార్ వివాదం రాజుకుంది. హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ చిత్రానికి ఇంకా సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. కేంద్రానికి వ్యతిరేక సన్నివేశాలున్నాయన్న ఆరోపణలే ఇందుకు కారణమని టాక్. ఇప్పటికే ఇదే కారణంతో ‘జననాయగన్’ వాయిదా పడగా.. శనివారం విడుదల కావాల్సిన ‘పరాశక్తి’ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సినిమా విడుదలపై సంది...
తమిళ హీరో శివకార్తికేయన్, దర్శకురాలు సుధా కొంగర కాంబోలో ‘పరాశక్తి’ మూవీ తెరకెక్కింది. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో మలయాళ దర్శకనటుడు బాసిల్ జోసెఫ్ క్యామియో రోల్లో కనిపించనున్నట్లు శివకార్తికేయన్ రివీల్ చేశాడు. అతను ఏ పాత్రలో కనిపించనున్నాడో మాత్రం చెప్పలేదు. ఇక ఇక ఈ సినిమాలో శ్రీలీల, రవి మోహన్, అథర్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కామెడీ సినిమాలో చేయడం ఎంతో కష్టమని చెప్పాడు. విమర్శలు వస్తుంటాయని, వాటిని తట్టుకుని నిలబడి మూవీలు చేస్తున్నానంటే అందుకు ప్రేక్షకులే కారణమని అన్నాడు. ఈ మూవీ నిర్మించడానికి ముందుకొచ్చిన సాహు, సుష్మితలకు థ్యాంక్స్ చెబుతున్నానని, భీమ్స్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడని తెలిపాడు.
నటి పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఓ డైరెక్టర్ హీరోయిన్ మోజులో పడి, కట్టుకున్న భార్యను కోమాలోకి వెళ్లేలా కొట్టాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేసింది. ఆ హీరోయిన్ ఆడియో ఫంక్షన్లలో మెరుస్తుంటే.. భార్య మాత్రం నరకం అనుభవించిందన్నారు. ‘మరో ఆడదాని కోసం భార్యను హింసిస్తారా?’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి.
నేచురల్ స్టార్ నాని లైనప్లో మరో ఆసక్తికర చిత్రం చేరనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీకి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. దీనికి ‘గౌరీ తనయ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. కార్తికేయుడి పౌరాణిక అంశాలతో సాగే ఈ చిత్రం.. నాని కెరీర్లో తొలి సోషియో ఫాంటసీ మూవీ కానుంది. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’, ‘బ్లడీ రోమియో’ చిత్రాలతో బిజీగా ఉన...
విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా పడింది. జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలిపింది. త్వరలో మరో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. ఈ సినిమాకు సెన్సార్బోర్డు ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో మద్రాస్ హైకోర్టులో విచారణ సాగింది. దీనిపై తీర్పును రిజర్వ్ చేశారు. జనవరి 9న ఉదయానికల్లా తుది ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
చిరంజీవి, వెంకటేష్ కలిసి నటిస్తే చూడాలని ఎంతో మంది డ్రీమ్ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. ‘నాది 8 సినిమాల ప్రయాణం. చిరంజీవితో 9వ మూవీ. ఏదైనా సినిమా మొదలు కావాలంటే, కథ ముఖ్యం. ఒక కథను పుట్టించడం చాలా కష్టం. వెంకటేష్ నాకు స్నేహితుడు, మార్గదర్శి, అంతకుమించి. మీరు ఎంజాయ్ చేస్తారు. కుదిరితే పుల్ లెంగ్త్ సినిమా చేయాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
చిరంజీవితో కలిసి నటించడం నిజంగా అద్భుతమైన అనుభూతి అని మరో అగ్ర కథానాయకుడు వెంకటేష్ అన్నారు. మహేష్, పవన్లతో కలిసి మల్టీస్టారర్ చేశానని చెప్పిన ఆయన.. ఇప్పుడు అన్నయ్య చిరంజీవితో చేస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు అనిల్తో తనది మంచి కాంబినేషన్ అని, ఈ సినిమాకు మంచి టీమ్ పనిచేసిందన్నారు. ఈ సంక్రాంతికి మంచి ఎంటర్టైన్ ఫిల్మ్ రాబోతోందన్నారు.
ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు మంచిగా ఆడాలని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ‘మన శంకర వరప్రసాద్గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీ సుభిక్షంగా ఉండాలి. ప్రభాస్, రవితేజ, శర్వానంద్ చిత్రాలు హిట్ అవ్వాలి. నా శిష్యుడు నవీన్ పోలిశెట్టి సినిమా కూడా ఆడాలి. వెంకీతో షూటింగ్ చాలా సరదాగా సాగింది. ఇదే కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తాం అని తెలిపారు.
రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జనవరి 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆషికా రంగనాథ్ సందడి చేసింది. ట్రైలర్ లాంచ్కి వస్తేనే.. సినిమా చూస్తున్నట్టు ఉందని తెలిపింది. ఫ్యామిలీస్తో కలిసి సినిమా చూడాలని కోరింది.