‘పాపం ప్రతాప్’ సక్సెస్ మీట్లో సీనియర్ నటి రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నిజం’ సినిమాలో తన నెగటివ్ పాత్రపై స్పందిస్తూ.. “నటిగా అన్ని షేడ్స్ ఉన్న పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నిజం మూవీలో నటించా. కానీ అది అంత నెగటివ్ అవుతుందని అనుకోలేదు. భవిష్యత్తులో ప్రేక్షకులు మెచ్చే పాత్రలే చేస్తాను. రోల్ పాజిటివా, నెగటివా అన్నది కాదు.. నాకు నచ్చితేనే నటిస్తా”...
టాలీవుడ్ సమ్మర్ బాక్సాఫీస్ ఈసారి బోసిపోయింది. పెద్ది, ది ప్యారడైజ్, టాక్సిక్, విశ్వంభర వంటి ప్రాజెక్టులు వాయిదా పడటంతో దాదాపు రూ.3000 కోట్ల నష్టం వాటిల్లిందని టాక్. థియేటర్లు ఖాళీగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే, చిన్న సినిమాలు సంచలనం సృష్టిస్తే తప్ప టాలీవుడ్ కోలుకోవడం కష్టం. భారీ మూవీల రాకతోనే మళ్లీ కళ వస్తుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.
తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం నటుడు అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా తన పేరు, గొంతు, ఫొటోలను వాణిజ్యపరంగా వాడకూడదని కోరాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, 3 రోజుల్లో కంప్లయన్స్ రిపోర్ట్ ఇవ్వాలని ‘ఫేక్ కాల్ పుష్ప’ సంస్థను ఆదేశించింది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల రక్షణలో ఈ తీర్పు అత్యంత కీలకంగా మారింది.
టాలీవుడ్ నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చేతబడి’. క్షుద్రపూజల నేపథ్యంలో, యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు సూర్యాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఐదు భాషల ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ సరిగమ భారీ ధరకు దక్కించుకుంది. M3 మీడియా, మహా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.
ఇటీవల క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తనకు ‘క్యూట్’ అంటూ మెసేజ్ చేశాడని బాలీవుడ్ నటి తాన్యా ఛటర్జీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై చాహల్ పరువు నష్టం దావా వేశాడంటూ తాన్యా మరోసారి చెప్పుకొచ్చింది. అందరూ తననే ప్రశ్నిస్తున్నారు కానీ చాహల్ని అడగట్లేదని పేర్కొన్న ఆమె.. తనకు అతను పరువు నష్టం దావా నోటీసులు పంపాడని తెలిపింది. అతను ఇలా చేయడం అర్థరహితంగా ఉందంది.
విజయ్ దేవరకొండ, ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైంది. తాజాగా ఈ మూవీని అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన’, ‘రణబాలి’లతో బిజీగా ఉన్న విజయ్, ఈ కొత్త మూవీతో తన మార్కెట్ను మరింత విస్తరించుకోనున్నాడు. శౌర్యువ్ క్లాసిక్ మేకింగ్, విజయ్ మాస్ ఇమేజ్ కలయికలో రాబోతున్న ఈ మూవీపై అంచనా...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘ది ఇండియా హౌస్’. నిఖిల్, సాయి మంజ్రేకర్ జంటగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 30% పూర్తయినట్లు తెలుస్తోంది. కీలకమైన సన్నివేశాల కోసం అనుపమ్ ఖేర్, నిఖిల్ తదితర కీలక నటీనటుల డేట్స్ కోసం చిత్ర బృందం ఎదురుచూస్తుందట. ఇక ఈ ఏడాది డిసెంబర్లో దీన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీరామునిపై ప్రకాష్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నాగబాబు తన సోషల్ మీడియాలో పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పేరు ఎత్తకుండానే ‘రాముడిని కించపరచడం సాహసం కాదు, అది అహంకారం, అజ్ఞానం’ అంటూ మండిపడ్డారు. ధర్మానికి వ్యతిరేకంగా విషం చిమ్మే వారిని చరిత్రే అణచివేస్తుందని.. రాముడిని ఎగతాళి చేసే వారు తమను తామే గాయపరుచుకుంటారని నాగబాబు ఘాటుగా స్పందించారు.
సూర్య, దర్శకుడు టీజే జ్ఞానవేల్ క్రేజీ కాంబో మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ‘జై భీమ్’ చిత్రంతో సంచలనం సృష్టించిన ఈ జోడీ, మరో పవర్ఫుల్ సోషల్ డ్రామా కోసం చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా బలమైన సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుందని, జ్ఞానవేల్ చెప్పిన పాయింట్ సూర్యకు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
బాలీవుడ్ నటి డైసీ షా టాలీవుడ్పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సినిమా చర్చల సమయంలో ఓ నిర్మాత తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తనను తాకుతూ ఇబ్బంది పెట్టారని ఆమె ఆరోపించింది. ఆ చేదు అనుభవం వల్లే మళ్లీ తెలుగు సినిమాల వైపు చూడలేదని వెల్లడించింది. తనకు ఇష్టం లేకుండా ఎవరైనా తాకితే ఒంటిపై తేళ్లు పాకినట్టు ఉంటుందని పేర్కొంది.
‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమయ్యాడు. తన రెండవ సినిమాను కూడా UV క్రియేషన్స్ బ్యానర్లో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్లు, ఆ కథకు తగిన హీరో కోసం మూవీ బృందం వెతుకులాటను ప్రారంభించినట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘జై హనుమాన్’. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో దగ్గుబాటి రానా భాగం కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన రావణుడిగా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రానాకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, ఆయన బేస్ వాయిస్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ షూటింగ్ నత్తనడకన సాగుతోంది. సినిమా ప్రకటించి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ 40% మాత్రమే పూర్తవ్వడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. క్వాలిటీ విషయంలో నీల్ రాజీ పడకపోవడమే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది. దీంతో 2026 విడుదల కష్టమేనని, 2027 వేసవిలోనే సినిమా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.
ప్రముఖ కమెడియన్ సత్య హీరోగా, దర్శకుడు రితేష్ రానా కాంబోలో వస్తున్న చిత్రం ‘జెట్లీ’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. మే 1న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు.