‘ఛాంపియన్’ ఫేమ్ రోషన్.. దర్శకుడు శైలేష్ కొలనుతో ‘ఏమో ఏమో ఇది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో రోషన్ మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు సమాచారం. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇంద్రగంటి శైలిలో టిపికల్ లవ్స్టోరీ కథాంశంతో రాబోతున్నట్లు టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.