టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో రాబోతున్న మూవీ ‘మృత్యుంజయ్’. 2026 మార్చి 6న ఇది రిలీజ్ కానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ మూవీలోని ‘హే జిందగీ’ పాటను ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని విడుదల చేయనున్నాడు. ఇక దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్ కథానాయికగా నటించింది.