ప్రకాశం: కనిగిరిలో నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నేతలు ఆర్డీవోకు వినతి పత్రం మంగళవారం సమర్పించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 99 వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి అందించాలని కోరారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పుకొచ్చారు.