NDL: బేతంచెర్లలో స్టేట్ బ్యాంక్ సమీపంలో సిమెంట్ ట్రక్కు ఇరుక్కుపోవడంతో తాగునీటి పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతోందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ టీ తాగేందుకు ట్రక్కును పక్కకు నిలపగా, టైర్లు భూమిలోకి కుంగి లోపల ఉన్న పైపు దెబ్బతిసిందన్నారు. దీంతో భారీగా నీరు బయటకు వస్తోందని వెల్లడించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు ఇవాళ మున్సిపల్ అధికారులను కోరారు.