NRML: కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో ఈరోజు గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు భారీగా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని తెలిపారు.