SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా ఆదివారం నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు. రబీ పంటల సేద్యానికి చివరి విడతగా 60 క్యూసెక్కుల సాగునీళ్లు వదిలినట్లు చెప్పారు. ఆయకట్టుదారు రైతులు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అయితే ఎడమ కాల్వ నీటిని వదల లేదన్నారు.