గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘చికిరి’ పాట రిలీజై సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీ సెకండ్ సింగిల్కు డేట్ ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మార్చి 3, 2026న ఈ పాటను విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.
ఓటీటీ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. MoodXVIP, Koyal PlayPro, Digi Movieplex, Feel, Jugnoo అనే ఐదు OTT ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రసారం చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, గతంలోనూ పలు ఓటీటీ సంస్థలను కేంద్రం బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్టు ‘NTRNeel’. తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించి క్రేజీ అప్డేట్ SMలో వైరలవుతోంది. మార్చి నెలాఖరులో రామోజీ ఫిల్మ్ సిటీలో NTRపై ఓ సాంగ్తో పాటు యాక్షన్ సీన్ కూడా షూట్ చేయన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ NTR కెరీర్లోనే బెస్ట్గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.
శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘విష్ణు విన్యాసం’. ఈ మూవీ గురించి హీరోయిన్ నయన్ సారిక స్పందిస్తూ.. ‘ఈ సినిమాలో నా క్యారెక్టర్కి చాలా షేడ్స్ వుంటాయి. కొంచెం ఫీమేల్ డామినేటింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్లో అబ్బాయిలకి కాస్త చిరాకు కలిగిస్తుంది’ అని చెప్పుకొచ్చింది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ FEB 27న విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి వేడుకలు ఉదయ్పూర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం జరుగనుంది. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, రాహుల్ రవీంద్రన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. రేపు జరగనున్న వివాహ కార్యక్రమంలో కేవలం 100 మంది గెస్ట్లు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీలో మరో స్టార్ యాక్టర్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నటుడు బాలాజీ మనోహర్ ‘భీరా’ అనే ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుపుతూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో మార్చి 19న విడుదల చేయనున్నారు.
తమిళ చిత్రం ‘హాట్స్పాట్: 2 మచ్’ తెలుగు వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’లో ఈనెల 27 నుంచి అందుబాటులోకి రానుంది. ప్రియా భవానీ శంకర్, భాస్కర్, తంబి రామయ్య, అశ్విన్ కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. సమాజంలోని సున్నితమైన అంశాలను దర్శకుడు ఈ సినిమాలో వెండితెరపై ఆవిష్కరించాడు.
పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న దక్షిణాది చిత్రాలకు ‘ధురంధర్ 2’ రూపంలో గట్టి పోటీ ఎదురుకాబోతుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డాడు. దక్షిణాది సినిమాలు సృష్టించిన బెంచ్ మార్క్ను ఈ సినిమా తుడిచేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ప్రేక్షకులు ఒక్కసారి ఈ తరహా సినిమా రుచి చూస్తే.. రొటీన్ మసాలా సినిమాలు ప్రమాదంలో పడినట్లేనని RGV హెచ్చరించాడు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్లో వచ్చిన ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ కాంబో మరో ప్రాజెక్ట్తో రాబోతోంది. అజిత్తో మరో సినిమా తీయబోతున్నట్లు శివ తాజాగా ప్రకటించాడు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నాడు.
ప్రముఖ టీవీ నటుడు మయాంక్ పవార్ (37) కన్నుమూశాడు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న అతడు ఈరోజు తుదిశ్వాస విడిచాడు. సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా, మయాంక్ ఏడుసార్లు మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్గా నిలిచాడు.
‘ది కేరళ స్టోరీ-2’ టీజర్ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ చిత్ర కథనం ఉందంటూ టీజర్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే దీనిపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. టీజర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని చిత్రబృందాన్ని ఆదేశించింది. దీంతో టీజర్ను వెనక్కి తీసుకుంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకల సందడి మొదలైపోయింది. రాజస్థాన్లోని ఉదయపూర్లో ఫిబ్రవరి 26న వారి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు ఉదయపూర్ చేరుకుంటున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా జంటగా ఉదయపూర్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతోంది.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈనెల 26న ఉదయ్పుర్లో ఘనంగా వివాహం చేసుకోనున్నారు. వీరి పెళ్లి తెలుగు, కన్నడ (కొడవ) సంప్రదాయాల ప్రకారం రెండు పద్ధతుల్లో జరగనుంది. ఉదయం తెలుగు పద్ధతిలో, సాయంత్రం కన్నడ సంప్రదాయంలో వివాహ వేడుకలు నిర్వహిస్తారు. దీంతో ఒకేరోజు వీరిద్దరూ రెండుసార్లు వివాహం చేసుకోబోతున్నారు. కాగా, మార్చి 3న HYDలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
తెలుగు చిత్రసీమలో ఫిల్మ్ఫేర్ అవార్డుల సందడి ఎప్పుడూ ఎక్కువే. అత్యధికంగా 7 అవార్డులతో మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. వీరి తర్వాత మహేష్ బాబు (5), శోభన్ బాబు, వెంకటేష్ (చెరో 4), ఏఎన్ఆర్, కృష్ణంరాజు, ఎన్టీఆర్, రామ్ చరణ్ మూడు అవార్డుల చొప్పున అందుకున్నారు.
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో మూవీకి ప్రదీప్ రూ.25 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. ఆయనకున్న యూత్ ఫాలోయింగ్తో నిర్మాతలు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, వచ్చే రెండేళ్ల వరకు ప్రదీప్ డేట్లు ఖాళీ లేవట. ఆయన షెడ్యూల్ అంతలా లాక్ అయిపోవడం హాట్ టాపిక్గా మారింది.