నిధి అన్వేషణ కథతో తెరకెక్కిన ‘తుంబాడ్’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ సినిమా సీక్వెల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. 2027లో డిసెంబర్ 27న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ.. ఓ పోస్టర్ను విడుదల చేశారు. సీక్వెల్కు కూడా అనీల్ రాహి బర్వె దర్శకత్వం వహించబోతున్నాడు.
‘ధురంధర్’ ఫ్రాంఛైజీతో సంచలనం సృష్టించిన దర్శకుడు ఆదిత్య ధర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. ఈ డైరెక్టర్ తన తర్వాతి చిత్రాన్ని ఏ హీరోతో చేయబోతున్నారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఆదిత్య ధర్ తన తర్వాతి ప్రాజెక్ట్ను కూడా రణ్వీర్ సింగ్తోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధురంధర్ పార్ట్-1’ జపాన్లో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని, జూలై 10న జపాన్లో గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి అక్కడ ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ‘ధ్రువ నక్షత్రం’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతుంది. 2017లో ప్రారంభమైన ఈ చిత్రం అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. మే 27న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు.
‘గాయపడ్డ సింహం’ ప్రమోషన్లలో ఫరియా అబ్దుల్లా ఆసక్తికర విషయాలను పంచుకుంది. తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘హనుమాన్’లో నటించే అవకాశం వచ్చినా తాను మిస్ చేసుకున్నట్లు ఆమె తెలిపింది. అది తన కెరీర్లో చేసిన అతిపెద్ద పొరపాటని పేర్కొంది. ఆ సినిమాను వదులుకున్నాననే బాధ తన మనసులో ఎప్పటికీ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ‘గాయపడ్డ సింహం’ మే 1న విడుదల కానుంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. వాకింగ్ చేస్తున్నప్పుడు గుండెపోటు రావడంతో దర్శకుడు రఘురామ్ తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో సహచరులు ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, రఘురామ్ 2004లో వచ్చిన ‘వరం’ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈయన స్వస్థలం జగిత్యాల కాగా ప్రస్తుతం హైదరాబాద్లోని మధురా నగర్లో ఉంటున్నాడు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. HYDలోని AMB సినిమాస్లో మ.3:30 గంటలకు ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఆదిత్య హాసన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాసేపట్లో విడుదల కానున్న టీజర్, ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెంచుతుందో చూడాలి.
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ జూన్ 26న విడుదల కానున్నట్లు అక్కినేని నాగార్జున తెలిపాడు. నిన్న రాత్రి మూవీ ఫస్ట్ కట్ చూశామని, సినిమాలో కొత్త అఖిల్ను చూస్తారన్నాడు. ఈ విషయాన్ని పూర్తి నమ్మకంతో చెబుతున్నట్లు ట్వీట్ చేశాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, జూన్ 25న రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ కానుంది.
టాలీవుడ్ యాక్ట్రెస్ గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నేను చీర కట్టుకోవాలా వద్దా అనేది నా ఇష్టం. శివాజీ అన్నారని నేను చీర కట్టుకోను. నాకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అదే వేసుకుంటా. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. చూసే చూపులో లోపం పెట్టుకుని ఎదుటివారిని విమర్శించొద్దు’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కన్నడ స్టార్ హీరో యష్ భారీ చిత్రం ‘టాక్సిక్’ విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించినట్లుగా జూన్ 4న విడుదల చేయలేకపోతున్నామని యష్ ప్రకటించాడు. ‘క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నాం’ అని చెప్పాడు. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో నటించిన పూజిత పొన్నాడ కీలక పాత్రలో కనిపించబోతుందట. కేవలం సోలో రోల్ మాత్రమే కాకుండా.. ఈ చిత్రంలో మరో ఇంట్రెస్టింగ్ యాక్టర్ నారా రోహిత్కు జోడీగా పూజిత కనిపించనుందని టాక్. ఈ సినిమా పూజితకు పెద్ద ప్లస్ అయ్యేలా ఉంది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన క్రేజీ యాక్షన్ లవ్ స్టోరీ మూవీ ‘డెకాయిట్’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మే 8 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ కాబోతుంది. దీనిపై అధికారికంగా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహం తిరుమలలో ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో ఇవాళ జరగనుంది. సినీ ప్రముఖుల కోసం మే 1న హైదరాబాద్లో భారీ ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా ఇప్పటికే శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.
TG: బిగ్బాస్ ఫేమ్, నటి అషురెడ్డి కేసులో విచారణ కొనసాగుతోంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ధర్మేంద్ర 3 రోజుల్లో లండన్ నుంచి HYDకు రానున్నారు. అయితే, అషురెడ్డి ఆడియోపై పోలీసులు ఫోకస్ పెట్టారు. బెదిరింపులకు పాల్పడినందుకు గానూ ఆమెపై మరో సెక్షన్ నమోదు చేశారు. ఇవాళ పోలీసుల ముందుకు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ రానున్నారు. అయితే, అషురెడ్డి రూ.9.35 కోట్లు తీసుకుందని ఫిర్యాదు చేశారు.
నిధి అగర్వాల్ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన నెలవారి ఖర్చుల గురించి ప్రస్తావించింది. ‘నా నెల ఖర్చు రూ. 5 లక్షలు. నా ట్రావెలింగ్, బస, డైట్, జిమ్ ట్రైనర్, పార్లర్ ఖర్చులకే రూ. 5 లక్షలు అవుతుంది. ఇవి కాకుండా మేకప్, హెయిర్స్టైలింగ్, ఫోటోస్ వంటి ఖర్చులు వేరు’ పేర్కొంది.