ధనుష్ హీరోగా దర్శకుడు విఘ్నేష్ రాజా రూపొందిస్తున్న ‘కర’ మూవీపై ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కోసం ముందుగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ను హీరోగా అనుకున్నారని ప్రచారం జరగగా, దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఆయనను తీసుకోవాలన్నది నిజమే అని చెప్పాడు. కానీ పృథ్వీరాజ్ను హీరో పాత్ర కోసం కాకుండా, కథలోని ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు ఆయన స్పష్టం చేశాడు.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో ‘బ్లడీ రోమియో’ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో నాని సరసన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథన్ నటించనున్నట్లు సమాచారం. దీంతో స్క్రీన్పై ఈ సరికొత్త జోడీ ఎలా ఉంటుందోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మలయాళ సెన్సేషన్ ‘వాజా 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రూ.10 కోట్లతో రూపొంది, 17 రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. నలుగురు అల్లరి కుర్రాళ్ల జీవిత ప్రయాణమే ఈ చిత్రం. ఈ మూవీ తెలుగులో ‘వాలా-2’ పేరుతో ఈ నెల 24న విడుదలవుతోంది. రేపు ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కానుంది.
నటన, గ్లామర్తో ఆకట్టుకుంటున్నా భామ భాగ్యశ్రీ బోర్సేకు లక్ కలిసిరావడం లేదు. ‘మిస్టర్ బచ్చన్’తో క్రేజ్ తెచ్చుకున్నా, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, రామ్ ‘ఆంధ్రా కింగ్’ వంటి చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం అఖిల్ అక్కినేని ‘లెనిన్’పైనే ఈమె ఆశలన్నీ ఉన్నాయి. జూన్ 26న విడుదల కానున్న ఈ సినిమా హిట్ అయితేనే భాగ్యశ్రీ కెరీర్ మలుపు తిరుగుతుంది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో ‘మెగా 158’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ రోల్ ఉందని, అందులో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ పాత్ర సినిమా క్లైమాక్స్లో వస్తుందని సమాచారం. ఇక ఈ సినిమా సెకండాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ సరికొత్త లుక్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో దర్శకుడు అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ మ్యూజిక్ అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నుట్లు సమాచారం.
దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ కూతురు దువా ప్రెగ్నెన్సీ కిట్ను పట్టుకున్న క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ దీపికా ఈ విషయాన్ని వెల్లడించింది. SEP 2024లో జన్మించిన దువా ఇప్పుడు అక్క కాబోతోంది. ఈ పోస్ట్కు కేవలం దిష్టి చుక్క ఎమోజీని క్యాప్షన్గా ఇవ్వగా, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న ‘రాకా’ మూవీపై క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. భారీ మేకింగ్ కారణంగా ఈ మూవీ 2027లో రావడం కష్టమని భావించినా, అట్లీ మాత్రం పక్కా ప్లాన్తో ఉన్నాడట. బన్నీ తన షూటింగ్ను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయనుండటంతో, 2027 సెకండ్ హాఫ్లో మూవీని విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
అఖిల్ ‘లెనిన్’ కోసం కింగ్ నాగార్జున స్వయంగా రంగంలోకి దిగారట. సినిమా ఫైనల్ కట్ చూసిన నాగ్, కొన్ని కీలక మార్పులు సూచించినట్లు టాక్. అభిమానులు పక్కా కమర్షియల్ హిట్ కోరుకుంటున్న నేపథ్యంలో, రన్టైం, ల్యాగ్ సీన్లపై నాగ్ ప్రత్యేక దృష్టి పెట్టారట. ఆయన సలహాతో ఎడిటర్ నవీన్ నూలి అనవసర దృశ్యాలను ట్రిమ్ చేస్తూ సినిమాను మరింత గ్రిప్పింగ్గా మలుస్తున్నట్లు సమాచారం.
నందమూరి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ తన ఐకానిక్ చిత్రం ‘ఆదిత్య 369’కి సీక్వెల్గా రాబోతున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’తోనే మోక్షజ్ఞను పరిచయం చేయనున్నట్లు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని సమాచారం.
చియాన్ విక్రమ్ హీరోగా ప్రేమ్ కుమార్ సీ. దర్శకత్వంలో ఓ మూవీ రాబోతుంది. ‘చియాన్ 64’ అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా.. ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో చియాన్ సరసన యంగ్ హీరోయిన్ రియా షిబు కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ ఎట్టకేలకు పట్టాలెక్కింది. సీక్వెల్ ఐడియా ఎప్పుడో ఉన్నా, సరైన సమయం కోసమే ఇన్నాళ్లు వేచి చూశామని దర్శకుడు తెలిపాడు. దాదాపు పాత తారాగణమంతా ఇందులో అలరించనుంది. అయితే కార్తీక్ పాత్రలో నటించిన సుశాంత్ వైజాగ్ కమిట్మెంట్స్ వల్ల తప్పుకోవడంతో, ఆ స్థానంలో శ్రీనాథ్ మాగంటి నటించనున్నట్లు తరుణ్ చెప్పాడు.
రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో రాబోతున్న ‘జైలర్ 2’ మూవీ అప్పుడే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. ఈ సినిమా OTT హక్కుల విషయంలో కోలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డీల్ కుదిరినట్లు సమాచారం. ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.160 కోట్లు వెచ్చించి అన్ని భాషల హక్కులను సొంతం చేసుకుందట. షూటింగ్ దశలో ఉండగానే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం హాట్ టాపిక్ అయింది.
హైదరాబాద్లో జరిగిన ‘డెకాయిట్’ థాంక్యూ మీట్లో హీరో అడివి శేష్ భావోద్వేగానికి లోనయ్యాడు. తన సినిమాల పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణే తన అసలైన క్రెడిబిలిటీ అని పేర్కొన్నాడు. తనకు వ్యక్తిగతంగా ‘గుడ్ సినిమా శేష్’ అనే ట్యాగ్ రావాలని కోరుకుంటున్నానని, ఆ స్థాయి సంతృప్తిని ‘డెకాయిట్’ చిత్రం ఇచ్చిందని వెల్లడించాడు.
మలయాళ సినిమాలకు ఓటీటీలో భలే క్రేజ్ ఉంటుంది. ఈ వారం ‘జియో హాట్స్టార్’లో వచ్చిన ‘సంభవం అధ్యాయం ఒన్ను’ ఆకట్టుకోగా, ఏప్రిల్ 24 నుంచి పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతిఛాయ’ స్ట్రీమింగ్ కానుంది. నివిన్ పౌలీ హీరోగా బి. ఉన్నికృష్ణన్ తెరకెక్కించిన ఈ చిత్రం కేరళ రాజకీయాల నేపథ్యంలో సాగుతుంది. అయితే తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.