‘వేదం’ సినిమాలో అనుష్క శెట్టి పోషించిన సరోజ పాత్రకు సీక్వెల్ ప్లాన్ చేయాలని అనుకున్నట్లు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెలిపారు. ‘ఊరి చివర ఇల్లు’ అనే నవలలో ‘రమ్య’ అనే వేశ్య పాత్రను ప్రేరణగా తీసుకుని.. సరోజ పాత్ర ఆధారంగా మంచి లవ్ స్టోరీని రాశానని చెప్పారు. కానీ ఆ పాత్రను చెడగొట్టేస్తామేమోనని డ్రాప్ అయినట్లు పేర్కొన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 33.34 పాయింట్లు నష్టపోయి 80,126 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 5.9 పాయింట్ల నష్టంతో 24,573 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.12గా ఉంది. కాగా, GSTలో నూతన సంస్కరణలపై ఇవాళ, రేపు GST మండలి భేటీలో చర్చల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
సోషల్ మీడియాలో తాను షేర్ చేసిన ఫొటోలు ఇ-కామర్స్ వెబ్సైట్లలో చూసి షాక్ అయినట్లు నటి సోనాక్షి సిన్హా తెలిపారు. తనను సంప్రదించకుండా, కనీసం తన అనుమతి లేకుండా తన ఫొటోలు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, వాటిని వెంటనే తొలగించాలని తెలిపారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
హీరో సూర్య 47వ చిత్రానికి మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమా పవర్ ఫుల్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని సమాచారం. ఈ మూవీలో నటి నజ్రియా హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘వరల్డ్వైడ్ పీకే వీకే అడ్మిరర్స్’ పేరుతో అభిమానులు ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్తో పాటు, స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ ఫొటోను ఏర్పాటు చేసి ‘హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం సార్’ అని ఉంది.
స్టార్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ కొత్త చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఆమెకు కథ నచ్చడంతో ప్రాజెక్ట్కి అంగీకరించినట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ చిత్రానికి ‘రమణ కేరాఫ్ ఆనంద నిలయం’ అనే టైటిల్ని ఖరారు చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కొత్త లోక’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ.. కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. వెంటనే చిత్రం నుంచి ఆ డైలాగ్స్ తొలగించనున్నట్లు ప్రకటించాడు.
కన్నడ నటి రన్యారావుకు భారీ షాక్ తగిలింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆమెకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రూ.102 కోట్ల జరిమానా విధించింది. ఆమెతో పాటు నలుగురు నిందితులకు మొత్తంగా రూ.270 కోట్ల జరిమానా విధించింది. కాగా, బంగారం అక్రమ రవాణా కేసులో రన్యారావు అరెస్టయిన విషయం తెలిసిందే.
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన డ్రీం ప్రాజెక్ట్ ‘వేదవ్యాస్’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాతో దక్షిణ కొరియాకు చెందిన నటి జున్ హ్యూన్ జీ(Jun Hyeon Jee) తెలుగులో కథానాయికగా అరంగేట్రం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఆమె నటించడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. తెలుగు వారి సంస్కృతి-సంప్రదాయాలు తనకెంతో నచ్చాయని ఈ కొరియన్ బ్యూటీ ఇటీవల చెప్పింది.
‘ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్’ (UNFPA)కి లింగ సమానత్వ భారత గౌరవ రాయబారిగా నటి కృతి సనన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పరిశ్రమలో లింగ సమానత్వం గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉండే సౌకర్యాలు, గుర్తింపు హీరోయిన్లకు ఉండటం లేదని ఆమె తెలిపారు. లింగ సమానత్వం విషయంలో చిత్ర పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘మిరాయ్’. ఈ సినిమా ఈనెల 12న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ‘మిరాయ్’ ట్రైలర్ను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసినట్లు మనోజ్ తెలిపాడు. ట్రైలర్ అద్భుతంగా ఉందని రజనీ ప్రశంసించినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు రజనీకాంత్కు కృతజ్ఞతలు చెబుతూ మనోజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.
దీర్ఘాయుష్మాన్ భవ అంటూ పవన్కు చిరంజీవి విషెస్ చెప్పగా.. చిరుకు పవన్ థాంక్స్ చెప్పారు. ‘నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్యకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, మీ శుభాకాంక్షలు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. సమాజానికి ఏదైనా చేయాలని మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు జనసేన ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది’ అని రాసుకొచ్చారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాణ సంస్థ DVV ఎంటర్టైన్మెంట్ ‘OG’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది. ‘ప్రతి యుగానికి ఒక స్టార్ వస్తాడు. కానీ, చరిత్రలో ఒక్కసారే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వస్తాడు. మన ‘OG’కి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది. కాగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న వ...
పవర్ స్టార్ పవన్కు చిరంజీవి బర్త్ డే విషెస్ చెప్పారు. ‘చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ’ అని వారిద్దరి ఫొటోను ట్వీట్ చేశారు.
AP: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక విషెస్ తెలియజేశారు. చలనచిత్ర రంగంలో అగ్ర నటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, AP ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ Xలో పోస్టు పెట్టారు. కాగా అల్లు అర్జున్, సాయి దుర్గ తేజ్, దర్శకుడు జ్యోతి కృష్ణ వంటి ప్రముఖులు కూడా పవన్కు శుభాకాంక్షలు తెలిపారు.