దర్శకుడు ప్రేమ్ రూపొందిస్తున్న ‘కేడీ: ది డెవిల్’ మూవీలోని ‘సర్కే చునార్ తేరీ సర్కే’ సాంగ్ వివాదంపై ఆయన భార్య నటి రక్షిత ఇన్స్టా వేదికగా స్పందించింది. గతంలో శృంగారభరిత సినిమాలు వచ్చినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ఆమె ప్రశ్నించింది. విమర్శించే హక్కు ఉన్నా, వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమని పేర్కొంటూ.. సినిమాపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేసింది.
నోరా ఫతేహి నటించిన ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట వివాదంపై గీత రచయిత రఖీబ్ ఆలం స్పందించాడు. ఈ పాటలోని అసభ్య పదజాలంపై వస్తున్న విమర్శలపై ఆయన వివరణ ఇచ్చాడు. దర్శకుడు ప్రేమ్ ఒత్తిడి వల్లే కన్నడ సాహిత్యాన్ని హిందీలోకి అనువదించాల్సి వచ్చిందని, కొన్ని లైన్లు ద్వంద్వార్థాన్ని ఇస్తున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. సెన్సార్ సమస్యలు వస్తాయని ముందే హెచ్చరించినా టీమ్ వినలేదని తెలిపాడు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 15న యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన ఈ వేడుకకు 1,500 మందికే అనుమతి ఉండగా, 5,000 మందికి పైగా హాజరయ్యారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బంది పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సెక్షన్ 188 కింద FIR నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. రేపు సినిమా విడుదల కానుండగా, నేటి నుంచే వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ మొదలయ్యాయి. కేవలం ప్రీమియర్స్ ద్వారానే రూ. 40 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మొదటి రోజు వసూళ్లు రూ. 150 నుంచి 180 కోట్ల వరకు ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి నటించిన రూరల్ డ్రామా ‘సుమతీ శతకం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, మార్చి 19, 2026 నుంచి ప్రముఖ ప్లాట్ఫారమ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో శైలీ చౌదరి హీరోయిన్గా, టేస్టీ తేజ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సాయి సుధాకర్ నిర్మించారు.
నటి మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సినీ పరిశ్రమలోకి బయటి వ్యక్తిగా అడుగుపెట్టి నిలదొక్కుకోవడం సవాలే. అవకాశాలు నాకు సులభంగా రాలేదు; నేనే వాటిని వెతుక్కుంటూ వెళ్లాను. నటనపై ఉన్న ప్రేమతో దర్శకులను కలిసి అవకాశాలు అడగడానికి నేను ఎప్పుడూ సిగ్గుపడలేదు. ప్రస్తుతం దక్షిణాది, బాలీవుడ్ చిత్రాల మధ్య సమతుల్యత పాటిస్తూ కెరీర్లో ముందుకు సాగుతున్నాను’ అని పేర్కొంది.
శర్వానంద్కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు సమాచారం. శర్వా, శ్రీను వైట్ల కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక యాక్షన్ కామెడీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పూజ కథానాయికగా నటించనున్నట్టు టాక్. ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలుపెట్టి, 2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
తమిళ హీరో శివకార్తికేయన్కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించనున్నట్లు తెలుస్తోంది. శివకార్తికేయన్ హీరోగా శివకుమార్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘సెయాన్’. ఇందులో భాగ్యశ్రీ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు టాక్. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.
సంగీత్ శోభన్ హీరోగా నటించిన మూవీ రాకాస.ఆయనకు జోడీగా నయనర్ సారిక కనిపించనుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ను శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. సినిమాకు థియేటర్స్లో మంచి ఆదరణ దక్కుతుందని ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి. కాగా ఈ మూవీ ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘సీతా పయనం’. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సన్ నెక్ట్స్ సొంతం చేసుకోగా ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా ఇందులో హీరోగా నిరంజన్ నటించారు.
ధృవ సర్జా, రీష్మా ముఖ్యపాత్రలు పోషిస్తున్న తాజా చిత్రం ‘కేడీ ది డెవిల్’. సంజయ్ దత్, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ‘సర్కే చునార్’ పాట వివాదాల్లో చిక్కుకుంది. పాట సాహిత్యం, నృత్యాలు అసభ్యంగా ఉన్నాయి. దీంతో అన్ని ఫ్లాట్ఫాంల నుంచి తొలగించాలని కేంద్ర సమాచారశాఖ మంత్రిత్వశాఖ CBFCని ఆదేశించింది.
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఈ మూవీకి సీక్వెల్గా ధురంధర్ 2 తెరకెక్కించారు. ఈ క్రమంలో ధురంధర్: ది రివెంజ్ సెన్సార్ పూర్తి అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ రన్ టైమ్ ఇండియాలో 3 గంటల 49 నిమిషాలు కాగా ఓవర్సీస్లో మాత్రం 3 గంటల 55 నిమిషాలతో మూవీని ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకరమైన కామెంట్లపై నటి రేణుదేశాయ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనపై దూషణలు చేస్తున్న నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్ వార్ డ్రామా ‘ఫౌజీ’. ఈ చిత్రాన్ని 2026 దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ పక్కా ప్లాన్తో ఉన్నారట. అందుకోసం జూలై లేదా ఆగస్టు కల్లా షూటింగ్ పూర్తి చేసి, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో ఇమాన్వీ టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన సోదరుడు ఈషాన్ రోషన్తో కలిసి నిర్మాణ రంగంలో సరికొత్త అడుగులు వేస్తున్నాడు. వీరిద్దరి కలయికలో ‘మెస్’ అనే క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. హృతిక్ తన సొంత బ్యానర్ ‘HRX ఫిలిమ్స్’ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కానుంది. అన్నదమ్ముల ఈ కొత్త ప్రయత్నంపై ఆసక్తి నెలకొంది.