అఖండ -2 సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లో యూనిటీ లేదన్నారు. టాలీవుడ్కి దిష్టి తగిలిందని తెలిపారు. టాలీవుడ్లో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండేజ్ వేయండని.. బ్యాండ్ వేయొద్దని హితవు పలికారు.
‘అఖండ 2’ విజయోత్సవ కార్యక్రమంలో నిర్మాత దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ, బోయపాటి చిత్రాల్లో ‘నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్’ ఉంటుందని ఆయన అన్నారు. లాజిక్ చూస్తే మ్యాజిక్ పనిచేయదని ఆయన తెలిపారు. ‘అఖండ 2’ సినిమాకు లాజిక్లు అక్కర్లేదని, అది దైవత్వమని చెప్పారు. ఈ సినిమా తరువాత జనరేషన్కు ఒక ‘భగవద్గీత, బైబిల్, ఖురాన̵్...
‘బిగ్ బాస్’ 9వ సీజన్ నుంచి కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే, 14 వారాల పాటు ఉన్నందుకు అతడు భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అతడు రోజుకు రూ.40 వేల చొప్పున, వారానికి రూ.2 లక్షల 80 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే, అతడు 14 వారాల్లో మొత్తం రూ.39 లక్షల 20 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 446.25 కోట్లు వసూళ్లు రాబట్టి, రూ.500 కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతోంది. నిన్న ఒక్కరోజే ఈ చిత్రం రూ. 53 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. కాగా, ఇది రణ్వీర్ సింగ్ కెరీర్లోనే రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
టాలీవుడ్ నటుడు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డెకాయిట్’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న తెలుగు, హిందీ భాషల్లో టీజర్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇక షానీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, 2026 మార్చి 19న ఇది విడుదల కాబోతుంది.
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన ‘మోగ్లీ’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ప్రీమియర్స్తో కలిపి ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1.22 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ‘వైల్డ్ బ్లాక్బస్టర్’ అంటూ పోస్టర్ షేర్ చేశారు.
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, దర్శకుడు విజయ్ కార్తికేయ కాంబోలో ‘మార్క్’ సినిమా రాబోతుంది. ఈ నెల 25న ఇది విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నవిష్క నాయుడు జాయిన్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. ‘మస్త్ మలైకా’ అనే ఐటెం సాంగ్లో సుదీప్తో కలిసి డ్యాన్స్ చేసినట్లు తెలిపారు. ఈ పాట రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల కానున్నట్లు ప్రకటించారు.
‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిమానులు చిరంజీవిని ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో, అదే విధంగా చూపించినట్లు తెలిపాడు. చిరులోని ‘అప్డేటెడ్ వెర్షన్’ కామెడీని ఈ సినిమాలో చూస్తారని పేర్కొన్నాడు. అలాగే, వెంకటేష్, చిరంజీవి వంటి టాప్ హీరోలను ఒకే స్క్రీన్పై చూపించే అవకాశం రావడం తన అదృష్టం అని వ్యాఖ్యానించాడు.
నటన ఈ తరాన్ని కూడా వదిలేసిందంటూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. తానేమి గొప్ప నటుడిని కాదని చెప్పాడు. తాను ఎమోషనల్ సన్నివేశాల్లో నటిస్తే.. ప్రేక్షకులు నవ్వుతారని తెలిపాడు. అలాగే తాను ఏమైనా చేస్తూ కనిపించవచ్చని చెప్పిన ఆయన.. నటిస్తూ మాత్రం కనిపించలేనని అన్నాడు. అది తన వల్ల కాదని, తనకు ఎలా అనిపిస్తే అలానే చేస్తానని చెప్పాడు.
హైదరాబాద్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ సినెక్స్ మల్టీప్లెక్స్ను కర్మాన్ఘాట్లోని కొలీసియం మాల్లో 7 స్క్రీన్ లగ్జరీ మల్టీప్లెక్స్ను ఏర్పాటు చేయనున్నాడు. ఈ అత్యాధునిక సినిమా హాల్ ద్వారా సినిమా ప్రియులకు మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా దీన్ని తీసుకురాబోతున్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ మూవీ ‘రాజాసాబ్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ రిలీజ్ కాగా.. తాజాగా సెకండ్ సింగిల్ ‘సహన సహన’పై అప్డేట్ వచ్చింది. ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు ఈ పాట ప్రోమో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దాదాపు 6ఏళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న మోడల్ గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ పాడ్కాస్ట్లో అర్జున్ చెప్పాడు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిందని వెల్లడించాడు. వీరికి పెళ్లికి ముందే ఇద్దరు కుమారులకు ఉన్నారు. కాగా, 2019 నుంచి వీరు రిలేషన్లో ఉన్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ ఈ నెల 21న జరగనుంది. అయితే ఇవాళ కంటెస్టెంట్ భరణి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ రేసులో తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన ఉంటారు. అయితే తాజాగా రిలీజైన ప్రోమోలో హోస్ట్ నాగార్జున.. విన్నర్కు రూ.50 లక్షల ప్రైజ్ మనీని ప్రకటించారు. ఇందులో ట్యాక్స్ రూపంలో కొంత కట్ అవుతుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా OTT రైట్స్పై అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 9 నాటికి సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
హీరోయిన్ సాయి పల్లవి లేడీ ఓరియెంటెడ్ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడట. ఈ మేరకు సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని ఓ అద్భుతమైన కథను ఆయన రెడీ చేసినట్లు తెలుస్తోంది. సాయి పల్లవికి కథను వినిపించగా.. ఆమె ఓకే చెప్పినట్లు టాక్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం.