విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మెమెంటోస్ హోటల్లో ఇవాళ సంగీత్, మెహందీ, రేపు హల్దీ జరగనున్నాయి. ఫిబ్రవరి 26న కేవలం 100 మంది అతిథుల మధ్య వీరి పెళ్లి జరగనుంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ‘విరోష్’ గ్రీన్ థీమ్ మెనూ, విజయ్ స్విమ్మింగ్ పూల్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పోస్ట్ చేశాడు. ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని నాని అన్నప్పుడల్లా, తనపై ఉన్న నమ్మకం చూసి భయమేస్తుందని అన్నాడు. ‘దసరా’ కోసం నానిని ఎంతో హింసించినా, నియమాలు ఉల్లంఘించినా ఆయన తనను ప్రోత్సహించారని తెలిపాడు. తనను నమ్మిన ‘ధరణి’కి, ఇప్పుడు నమ్ముతున్న ‘జడల్’ (ది ప్యారడైజ్)కి రుణపడి ఉంటానంటూ నానికి...
ఇవాళ నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన నాని ‘అష్టా చమ్మా’తో హీరోగా మారాడు. తన సహజ నటనతో ‘నేచురల్ స్టార్’గా ఎదిగాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.
శరీర బరువు కారణంగా తాను ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో నటి మృణాల్ ఠాకూర్ చెప్పింది. ‘నాకు ఇంకా ఆ రోజులు గుర్తున్నాయి. ఏడుస్తూ నిద్రపోయి.. ఉబ్బిన కళ్లలో మేల్కొన్న రోజులు ఉన్నాయి. శరీరాకృతి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనుకునేదాన్ని. దాన్ని అధిగమించడానికి చాలా ధైర్యం కావాలి. అప్పుడే అర్థమైంది.. మనం ఎలా ఉన్నా నచ్చేవాళ్లకు నచ్చుతాం’ అని పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన సినిమా ‘విశ్వంభర’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక గ్లింప్స్ ద్వారా విడుదల తేదీని వెల్లడించాలని సన్నాహాలు చేస్తున్నారట. అయితే 2026 జూన్లో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీ ‘కల్కి 2898ఏడీ’. భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ శంకర్పల్లి సమీపంలో అమితాబ్ బచ్చన్పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈనెలాఖరు నుంచి ప్రభాస్ షూటింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం. కమల్హాసన్ మార్చి తర్వాత సెట్లోకి వస్తారు.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రాబోయే షెడ్యూల్లో 20 నిమిషాల పాటు సాగే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది సినిమాకే ప్రధాన హైలైట్గా నిలవబోతుందట. ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా కనిపిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. జనవరి 30న థియేటర్లలోకి విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 4 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కోపిష్టి ఓంకార్(తరుణ్), స్వేచ్ఛ కోరుకునే ప్రశాంతి(ఈషా)ల పెళ్లి తర్వాత వారి జీవితాల్లో ఎదురైన నాటకీయ పరిణామాల సమాహారమే ఈ మూవీ కథ.
NTR, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ వార్తలు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, నార్త్ అమెరికా, యూకే హక్కుల కోసం సుమారు రూ.55 కోట్ల అడ్వాన్స్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే ఇది భారీ ఓవర్సీస్ డీల్గా భావిస్తున్నారు.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈనెల 27న ‘రూబారూ’ అనే ఫస్ట్ సింగిల్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘AA22’. ‘పుష్ప 2’ విజయం తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో, దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ఓ అదిరిపోయే అప్డేట్ SMలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ ప్రొఫెషనల్ సింగర్గా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. అర్జిత్ సింగ్ను కలిసి పాటలు పాడటం ఆపొద్దంటూ స్వయంగా కోరాడు. ముర్షిదాబాద్లోని అర్జిత్ సింగ్ నివాసానికి వెళ్లిన అమీర్.. ‘నువ్వు పాటలు పాడటం ఆపేస్తే మేము ఏమైపోతాం?’ అంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం.
ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడం, కావాలని తనను పక్కన పెట్టడంతోనే తాను హాలీవుడ్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఆ సమయంలో తాను తీవ్ర ఒత్తిడికి గురైనట్లు పేర్కొంది. హాలీవుడ్లో ఎన్ని విజయాలు వచ్చినప్పటికీ, భారతీయ చిత్రాల్లో నటించేందుకే తాను ఎప్పుడూ మొగ్గు చూపుతానని వెల్లడించింది.