‘ఉప్పెన’తో డెబ్యూ ఇచ్చిన నటి కృతి శెట్టికి బ్యాడ్లక్ వెంటాడుతోంది. ఆమె నటించిన మూవీలు వాయిదా పడుతున్నాయి. హీరో కార్తీతో కృతి నటించిన ‘అన్నగారు వస్తారు’ మూవీ ఈ నెల 12న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. అలాగే ఈ నెల 18న విడుదల కావాల్సిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ కూడా వాయిదా పడనున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రభావం కృతి కెరీర్పై పడనున్నట్లు టాక్ వి...
వరుస హిట్లతో దూసుకెళ్తోన్న నందమూరి బాలకృష్ణ.. తాజాగా మరో ఘనత సాధించారు. ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో వచ్చి హిట్ కొట్టిన హీరోగా ఆయన నిలిచారు. ఈ ఏడాది జనవరిలో ‘డాకు మహారాజ్’, డిసెంబర్లో ‘అఖండ 2’ చిత్రాలతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో నందమూరి అభిమానులు.. ‘ప్రారంభం బాలయ్యదే.. ముగింపు బాలయ్యదే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రొమ్ము క్యాన్సర్తో టాలీవుడ్ నటి వాహిని పోరాడుతుంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే వాహిని ట్రీట్మెంట్కు దాదాపు రూ.35 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ తెలిపినట్లు సమాచారం. దీనిపై నటి కరాటే కళ్యాణి SMలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె చికిత్స కోసం ఆర్థికసాయం చేయాలని కోరింది.
ఇటీవల కాలంలో నందమూరి బాలకృష్ణ సినిమాలన్నీ సూపర్ హిట్గా నిలుస్తున్నాయి. ఆయన నటించిన ‘అఖండ’, ‘వీరసింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’, ‘అఖండ 2’ సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. ఇలా వరుసగా ఐదు హిట్లు అందుకుని బాలయ్య రికార్డు సృష్టించారు. దీంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే హిందీలో నిన్న ఈ సినిమా రూ.34.70CR సాధించింది. దీంతో బాలీవుడ్లో అల్లు అర్జున్ ‘పుష్ప 2′(రూ.27.50కోట్లు) రికార్డును ఇది బ్రేక్ చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ‘ఛావా'(రూ.24.30CR), ‘యానిమల్'(రూ.23.53...
ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎండింగ్కు వచ్చేసింది. ఫినాలే దగ్గరపడుతున్న కొద్దీ హౌస్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. హౌస్లో ప్రస్తుతం భరణి, సుమన్ శెట్టి, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, తనూజ, సంజన ఉండగా.. వారిలో భరణి, సుమన్ శెట్టి ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం.
నందమూరి బాలకృష్ణతో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2’ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ప్రీమియర్స్తో కలిపి మొదటి రోజు ఈ చిత్రం రూ. 59.5 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
‘కడలి’ సినిమా హీరోయిన్ తులసి నాయర్ ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారింది. తాజాగా ఆమె లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు షాక్ అవుతున్నారు. తులసి ఇలా మారిపోయింది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె గుర్తుపట్టలేనంతగా మారినట్లు తెలుస్తోంది. సీనియర్ నటి రాధా కూతురైన తులసి.. రెండు సినిమాలు చేసి నటనకు గుడ్ బై చెప్పింది.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘రాజాసాబ్’. 2026 JAN 9న విడుదల కానుండగా.. ఓవర్సీస్లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. వీటి ద్వారా ఇప్పటివరకు 100K డాలర్లకుపైగా వసూళ్లు సాధించింది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తే అక్కడ భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
అడివి నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథతో తెరకెక్కిన ‘మోగ్లీ 2025’ మూవీ ఇవాళ విడుదలైంది. తన ప్రేయసిని విలన్ నుంచి హీరో ఎలా రక్షించుకున్నాడనేది ఈ సినిమాలో చూపించారు. నటీనటుల నటన బాగుంది. విజువల్స్, సెకండాఫ్లో కొన్ని సన్నివేశాలు మూవీకి ప్లస్ అయ్యాయి. కొత్తదనం లేని కథనం, సాగదీత సన్నివేశాలు, కొరవడిన భావోద్వేగాలు మైనస్. రేటింగ్:2.5/5.
జూ.ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ తెరకెక్కుతోంది. లాంగ్ బ్రేక్ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ HYDలోని రామోజీ ఫిలిం సిటీలో ఇవాళ ప్రారంభమైంది. ఇందులో తారక్తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాదాపు మూడు నెలలపాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కాగా, రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ 2026 జూన్ 25న విడుదలవుతుంది.
తమిళ హీరో విజయ్ దళపతితో దర్శకుడు H. వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా ‘జన నాయగన్’. ఈ మూవీ 2026 JAN 9న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాను ఐమ్యాక్స్ వెర్షన్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక KVN ప్రొడక్షన్స్ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మలయాళ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’. థియేటర్లలో విడుదలైన దాదాపు 11 నెలల తర్వాత OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT వేదిక జీ5లో ఈ నెల 19నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
‘ధురంధర్’ సినిమా తన హృదయానికి హత్తుకుందని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పోస్ట్ పెట్టాడు. దీనిపై తాజాగా ఆ మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ స్పందించాడు.’ఈ మూవీపై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. మీ ప్రశంసలకు ఈ సినిమా కోసం కష్టపడిన వారందరూ అర్హులే. దీనికి పార్ట్ 2 వస్తుంది. అది తీసేటప్పుడు అందరి సూచనలను దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తాం’ అని అన్నాడు.